Medha Patkar: మేధాపాట్కర్ అరెస్ట్

Medha Patkar

సామాజిక కార్యకర్త, నర్మదా బచావో ఆందోళన ఉద్యమ కారిణి (Medha Patkar) మేధా పాట్కర్ ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీలోని నిజాముద్దీన్‌లోని ఆమె నివాసానికి చేరుకున్న పోలీసుల బృందం ఆమెను అదుపులోకి తీసుకుంది. మేధా పాట్కర్‌ (Medha Patkar) అరెస్ట్‌ను సౌత్‌ఈస్ట్‌ డీసీపీ రవి కుమార్‌ సింగ్‌ ధృవీకరించారు. మధ్యాహ్నం ఆమెను సాకేత్‌ కోర్టులో పోలీసులు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మేధా పాట్కర్‌, వీకే సక్సేనాల మధ్య 2000 సంవత్సరం నుంచి న్యాయపోరాటం సాగుతోంది. నర్మదా బచావో ఆందోళన్‌కు వ్యతిరేకంగా ప్రకటనలు ప్రచురించారనే ఆరోపణలపై వినయ్‌ కుమార్‌ సక్సేనా పై ఆమె అప్పట్లో కేసు వేశారు.

అప్పుడు ఆయన అహ్మదాబాద్‌ కేంద్రంగా ఉన్న ‘నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ సివిల్‌ లిబర్టీస్‌’ అనే ఎన్జీవోకు చీఫ్‌గా ఉన్నారు. ఆ సమయంలో గుజరాత్‌ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన సర్దార్‌ సరోవర్‌ ప్రాజెక్టుకు సక్సేనా మద్దతు ఇచ్చారు. అయితే ఓ టీవీ ఛానెల్‌ ఇంటర్వ్యూలో తనను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడంతోపాటు పరువునష్టం కలిగించేలా పత్రికా ప్రకటన జారీ చేశారని ఆరోపిస్తూ పాట్కర్‌పై వీకే సక్సేనా సైతం రెండు కేసులు దాఖలు చేశారు. ఈ కేసులో గత ఏడాది జులై1వ తేదీన ఆమెకు ఐదు నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పు కూడా ఇచ్చింది. అయితే అదే నెల ఆఖరులో ఆ శిక్షను రద్దు చేస్తూ పలు షరతుల మీద న్యాయమూర్తి మేధా పాట్కర్‌కు బెయిల్‌ మంజూరు చేశారు. ఆ షరతులను ఉల్లంఘించడంతోనే కోర్టు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. దీంతో ఆమెను ఇవాళ పోలీసులు అరెస్టు చేశారు.

Image

సామాజిక కార్యకర్త, నర్మదా బచావో ఆందోళన ఉద్యమ కారిణి మేధా పాట్కర్ ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీలోని నిజాముద్దీన్‌లోని ఆమె నివాసానికి చేరుకున్న పోలీసుల బృందం ఆమెను అదుపులోకి తీసుకుంది. మేధా పాట్కర్‌ అరెస్ట్‌ను సౌత్‌ఈస్ట్‌ డీసీపీ రవి కుమార్‌ సింగ్‌ ధృవీకరించారు. మధ్యాహ్నం ఆమెను సాకేత్‌ కోర్టులో పోలీసులు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మేధా పాట్కర్‌, వీకే సక్సేనాల మధ్య 2000 సంవత్సరం నుంచి న్యాయపోరాటం సాగుతోంది. నర్మదా బచావో ఆందోళన్‌కు వ్యతిరేకంగా ప్రకటనలు ప్రచురించారనే ఆరోపణలపై వినయ్‌ కుమార్‌ సక్సేనా పై ఆమె అప్పట్లో కేసు వేశారు.

Imageఅప్పుడు ఆయన అహ్మదాబాద్‌ కేంద్రంగా ఉన్న ‘నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ సివిల్‌ లిబర్టీస్‌’ అనే ఎన్జీవోకు చీఫ్‌గా ఉన్నారు. ఆ సమయంలో గుజరాత్‌ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన సర్దార్‌ సరోవర్‌ ప్రాజెక్టుకు సక్సేనా మద్దతు ఇచ్చారు. అయితే ఓ టీవీ ఛానెల్‌ ఇంటర్వ్యూలో తనను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడంతోపాటు పరువునష్టం కలిగించేలా పత్రికా ప్రకటన జారీ చేశారని ఆరోపిస్తూ పాట్కర్‌పై వీకే సక్సేనా సైతం రెండు కేసులు దాఖలు చేశారు. ఈ కేసులో గత ఏడాది జులై1వ తేదీన ఆమెకు ఐదు నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పు కూడా ఇచ్చింది. అయితే అదే నెల ఆఖరులో ఆ శిక్షను రద్దు చేస్తూ పలు షరతుల మీద న్యాయమూర్తి మేధా పాట్కర్‌కు బెయిల్‌ మంజూరు చేశారు. ఆ షరతులను ఉల్లంఘించడంతోనే కోర్టు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. దీంతో ఆమెను ఇవాళ పోలీసులు అరెస్టు చేశారు.

Also read: