పెగాసస్ స్పైవేర్ (Spyware) వ్యవహారంపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లపై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్. కోటేశ్వర్ సింగ్ లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో వాదనలు విన్న కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దేశ భద్రత కోసం (Spyware) స్పైవేర్ను కలిగిఉండటం తప్పులేదని స్పష్టంచేసింది. ఈసందర్భంగా పిటిషన్ తరఫున న్యాయవాది మాట్లాడుతూ.. పెగాసస్ స్పైవేర్ను ఉపయోగిస్తోందా? లేదా అన్న విషయాన్ని కేంద్రం స్పష్టంగా చెప్పాలన్నారు. అంతేగాక, ఈ ఆరోపణలపై దర్యాప్తు జరిపి సాంకేతిక నిపుణుల బృందం నివేదిక కోసం సర్వోన్నత న్యాయస్థానం గతంలో ఆదేశించిందని, ఇప్పటివరకూ ఆ నివేదిక అందలేదని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. దాన్ని వెంటనే బహిర్గతం చేయాలని కోరారు.
దీనికి ధర్మాసనం బదులిస్తూ.. ‘దేశ వ్యతిరేక శక్తులపై స్పైవేర్ను వినియోగిస్తే ఏ తప్పు లేదు. నేషనల్సెక్యూరిటీ విషయంలో రాజీపడకూడదు. ఒకవేళ సామాన్య పౌరులపై ఉపయోగిస్తే గనుక దాని గురించి మేం దర్యాప్తు జరిపిస్తాం. ఉగ్రవాదులు గోప్యత హక్కును కోరకూడదు. దేశ భద్రత, సార్వభౌమత్వాన్ని ప్రభావితం చేసే ఏ నివేదికను బహిర్గతం చేయబోం. కానీ ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు దాని గురించి తెలుసుకోవాలనుకుంటే.. వారికి సమాచారం అందిస్తాం. ఇదే సమయంలో.. సాంకేతిక కమిటీ నివేదికను వీధుల్లో చర్చించుకునే ఓ డాక్యుమెంట్గా మార్చరాదు’ అని ధర్మాసనం స్పష్టంచేసింది. ఈ సందర్భంగా పహల్గాం ఉగ్రదాడి ఘటనను పరోక్షంగా ప్రస్తావిస్తూ.. ‘ప్రస్తుతం మన దేశం ఎలాంటి పరిస్థితిలో ఉందో అందరికీ తెలుసు. మనం అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది’ అని తెలిపింది.
దీనికి ధర్మాసనం బదులిస్తూ.. ‘దేశ వ్యతిరేక శక్తులపై స్పైవేర్ను వినియోగిస్తే ఏ తప్పు లేదు. నేషనల్సెక్యూరిటీ విషయంలో రాజీపడకూడదు. ఒకవేళ సామాన్య పౌరులపై ఉపయోగిస్తే గనుక దాని గురించి మేం దర్యాప్తు జరిపిస్తాం. ఉగ్రవాదులు గోప్యత హక్కును కోరకూడదు. దేశ భద్రత, సార్వభౌమత్వాన్ని ప్రభావితం చేసే ఏ నివేదికను బహిర్గతం చేయబోం. కానీ ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు దాని గురించి తెలుసుకోవాలనుకుంటే.. వారికి సమాచారం అందిస్తాం. ఇదే సమయంలో.. సాంకేతిక కమిటీ నివేదికను వీధుల్లో చర్చించుకునే ఓ డాక్యుమెంట్గా మార్చరాదు’ అని ధర్మాసనం స్పష్టంచేసింది. ఈ సందర్భంగా పహల్గాం ఉగ్రదాడి ఘటనను పరోక్షంగా ప్రస్తావిస్తూ.. ‘ప్రస్తుతం మన దేశం ఎలాంటి పరిస్థితిలో ఉందో అందరికీ తెలుసు. మనం అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది’ అని తెలిపింది.
Also read:
- Rajya Sabha: మావుళ్ళమ్మ ఆశీస్సులతో నేడు నామినేషన్ దాఖలు
- TG EAPCET: పరీక్షలు ప్రారంభం, కేంద్రాల్లో కట్టుదిట్టమైన భద్రత

