మన దేశ రక్షణకు సంబంధించిన కీలక సమాచారాన్ని పాకిస్తాన్కు చేరవేశారన్న ఆరోపణలపై అరెస్టైన హర్యానాకు చెందిన యూ ట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు (Jyoti Malhotra)దాయాది దేశంలో వీఐపీ ట్రీట్మెంట్ లభించడం పట్ల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పాక్లో ఆమెకు దాయాది దేశం ఆరుగురు గన్మెన్లను ఏర్పాటు చేసింది. ఏకే 47 రైఫిల్స్తో ఆమెకు రక్షణ కల్పించారు.

స్కాంట్లాండ్కు చెందిన యూ ట్యూబర్ కల్లమ్ మిల్ తన యూ ట్యూబ్ చానల్లో అప్లోడ్ చేసిన వీడియో ద్వారా ఈ విషయం వెల్లడైంది. జ్యోతి మల్హోత్రా పాక్ను సందర్శించిన సమయంలో అదే దేశంలో పర్యటిస్తున్న స్కాంట్లాండ్ యూ ట్యూబర్ను ఆమెను లోహోర్లోని అనార్కలి బజార్లో కలిశాడు.

ఆ ప్రాంతంలో వీడియోలు చిత్రీకరిస్తున్న జ్యోతికి (Jyoti Malhotra)అంతమంది గన్మెన్లు రక్షణగా ఉండటం చూసి షాకయ్యాడు. ఆమెతో తనను తాను పరిచయం చేసుకొన్నాడు. పాక్కు మొదటిసారి వచ్చారా అని జ్యోతి అడగ్గా… లేదు ఐదు సార్లు వచ్చానని బదులిచ్చాడు. తాను ఇండియన్ అని చెప్పిన జ్యోతి అక్కడ తనకు దగ్గిన సెక్యూరిటీ పట్ల గొప్పగా ఫీలవుతున్నట్లు అతడితో చెప్పింది.

ఆర్థిక వ్యవహారాలపై విచారణ
స్కాట్లాండ్ యూ ట్యూబర్ వీడియో బయటికొచ్చిన తర్వాత జ్యోతి మల్మోత్రా గురించి అనేక అనుమానాలు వక్తం అవుతున్నాయి. ఆమె ఆర్థిక వ్యవహారాలపై అధికారులు విచారణ చేస్తున్నారు.

ఆమె విలాసవంతమైన జీవితం గడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. విమానాల్లో ఫస్ట్ క్లాస్లో ప్రయాణించేదని, ఖరీదైన హోటళ్లలో బస చేసేదని అధికారుల విచారణలో వెల్లడైంది.
Also read :
NITI AAYOG: 2047 నాటికి వికసిత్ భారత్
Mahesh Goud : బీఆర్ఎస్ మూడు ముక్కలు!

