Narendra Modi: పాక్ యుద్ధ వ్యూహం ఉగ్రవాదమే!

Narendra Modi

పాకిస్తాన్  ఆచరిస్తున్న ఉగ్రవాదం పూర్తిగా ఉద్దేశ పూర్వకమని, వాళ్ల యుద్ధ వ్యూహం అదేనని ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు. భారత్ ఆ వ్యూహాన్ని తిప్పి కొట్టేందుకు, గట్టిగా బదులిచ్చేందుకు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుందని ప్రధాని అన్నారు. ఇవాళ ఆయన గుజరాత్ లో పర్యటించారు. గాంధీనగర్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో (Narendra Modi) ప్రధాని మాట్లాడుతూ.. ఆపరేషన్‌ సిందూర్‌లో హతమైన ముష్కరుల అంత్యక్రియలను పాక్‌ ప్రభుత్వం అధికార లాంఛనాలతో నిర్వహించిందని మోదీ దుయ్యబట్టారు. ఉగ్రవాదుల శవపేటికలపై పాక్‌ జాతీయజెండా కప్పటంతోపాటు సైన్యం సెల్యూట్‌ చేసినట్లు తెలిపారు.

Imageఅందువల్ల పాక్‌ భూభాగం నుంచి జరుగుతున్న ఉగ్రవాదుల దాడులు పక్కా పథకం ప్రకారం వ్యూహాత్మకంగా జరుగుతున్నవేనని ఆరోపించారు. ఉగ్రవాదాన్ని ఇప్పటివరకు పరోక్షయుద్ధం అనేవారమని, మే 6 తర్వాత కాదని అర్థమైందని అన్నారు. పాకిస్తాన్ లో ఉన్న 9 ఉగ్ర స్థావరాలను గుర్తించి కేవలం 22 నిమిషాల్లో ధ్వంసం చేశామని చెప్పారు. ఈ సారి కెమెరాలు కూడా పెట్టామన్నారు. ఎందుకంటే మనవారే ఎవరైన సాక్ష్యం అడిగితే ఇవ్వటానికని చెప్పారు.

Image ఇప్పుడు మనం సాక్ష్యాలు ఇవ్వాల్సిన అవసరం లేకుండా అక్కడివారే ఇస్తున్నారని ప్రధాని మోదీ అన్నారు. 1947లో భారత్​ను మూడు ముక్కలుగా చేశారని అన్నారు. అదే రోజు రాత్రి కశ్మీర్​పై మొదటి ఉగ్రవాద దాడి జరిగిందని చెప్పారు. ఉగ్రవాదుల సాయంతోనే కశ్మీర్​లోని కొంత భాగాన్ని పాకిస్తాన్ స్వాధీనం చేసుకుందని చెప్పారు. సర్దార్ పటేల్ సలహాలను అంగీకరించి, ఆ రోజే ఉగ్రవాదలను చంపిఉంటే భారత్​లో గత 75 ఏండ్లుగా కొనసాగుతున్న ఈ ఉగ్ర కార్యకలాపాలు ఉండేవి కాదన్నారు.

Image

భారత్‌ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఐదో తరం యుద్ధ విమానం అడ్వాన్స్‌ మీడియం కాంబాట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ కు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆమోద ముద్రవేశారు. రక్షణ రంగంలో స్వదేశీ తయారీని ప్రోత్సహించే దిశగా రక్షణ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఇతర సంస్థల భాగస్వామ్యంతో బెంగళూరులోని డీఆర్‌డీవో, ఏరోనాటికల్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ దీనిని సిద్ధం చేస్తోంది. తొలిసారి ‘ఏరో ఇండియా-2025’లో ప్రపంచానికి చూపించారు. ఏఐ ఆధారిత ఎలక్ట్రానిక్‌ పైలట్, నెట్‌ ఆధారిత ఆయుధ వ్యవస్థల లాంటి ప్రత్యేకతలు ఈ విమానం సొంతం. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ ఇది సమర్థంగా సత్తా చాటుతుంది. 25 టన్నుల బరువు ఉండే ఈ విమానాన్ని మానవ సహితంగా, మానవ రహితంగా పనిచేసేలా రూపొందించనున్నారు. ఏడీఏ ఈ యుద్ధ విమానం డిజైన్‌ను రూపొందించింది. హైదరాబాద్‌కు చెందిన వేమ్‌ టెక్నాలజీస్‌ లిమిటెడ్‌ సంస్థ ఫ్యాబ్రికేషన్‌ పనులు చేసింది.

Also read: