ఇరాన్ ఇజ్రాయిల్ (Iran Israel) మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త వాతావరణం నేపథ్యంలో పెట్రోల్ ధరలుపెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతాయా… అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది… ఇప్పటికే పెట్రోల్ ధరలు దాదాపు 100 రూపాయలు పైన ఉన్న నేపథ్యంలో.. ఇప్పుడు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. (Iran Israel) దీనికి ప్రధాన కారణం చెప్పవచ్చు. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ అత్యధికంగా పశ్చిమాసియా దేశాల నుంచే లభిస్తుంది అన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో క్రూడ్ ఆయిల్ ఉత్పత్తుల పైన దీని ప్రభావం పడే అవకాశం ఉంటుంది.
ముఖ్యంగా అరేబియా సముద్రంలో చమురు సరఫరా చేసే నౌకల స్వేచ్ఛగా తిరగడానికి ఆటంకం ఏర్పడే అవకాశం ఉంది. తద్వారా ముడిచమురు సరఫరా అనేది నిలిచిపోయే ప్రమాదం ఉంటుంది తద్వారా క్రూడ్ ఆయిల్ ధరలు కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇరాన్, ఇరాక్, కువైట్, సౌదీ వంటి దేశాల నుంచి మన దేశానికి పెద్ద ఎత్తున క్రూడ్ ఆయిల్ సరఫరా అవుతుంది. ఈ సరఫరాపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది.
ప్రధాన చమురు మార్కెటింగ్ కంపెనీలు క్రూడ్ ఆయిల్ పెరుగుదల భారాన్ని మోయాల్సి ఉంటుంది. ముడి చమురు కొనుగోలు ఖర్చులు పెరగడం వల్ల పెట్టుబడిదారులు లాభాల మార్జిన్లు తగ్గుతాయనే భయంతో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) షేర్లు 4 శాతం, హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ( HPCL) దాదాపు 4.5 శాతం, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC) దాదాపు 3 శాతం క్షీణించాయి.
బ్రెంట్ ముడి చమురు ధరలు 9 శాతానికి పైగా పెరిగి, బ్యారెల్కు 75.61 డాలర్ల సమీపానికి చేరుకోవడంతో శుక్రవారం భారత ఈక్విటీ మార్కెట్లు ఒత్తిడికి గురయ్యాయి. గల్ఫ్ దేశాల్లో ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం వల్ల పెరుగుతున్న యుద్ధ సంక్షోభం ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న స్టాక్ మార్కెట్ అంతటా కనిపించాయి, ముడి చమురుతో కనెక్షన్ ఉన్న స్టాక్లు భారీగా పతనం అయ్యాయి.

