మణిపూర్లో(Manipur) భద్రతాదళాలు భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నాయి. ఐదు జిల్లాల్లో తనిఖీలు చేసిన అధికారులు మొత్తం 328 తుపాకులు, మరో 9,300లకు పైగా వివిధ రకాల మందుగుండు సామాగ్రిని పట్టుకున్నారు. ఇంఫాల్ వెస్ట్, ఇంఫాల్ ఈస్ట్, తౌబాల్, బిష్ణుపూర్, కాక్చింగ్ జిల్లాల్లో భారీగా ఆయుధాలు ఉన్నాయన్న సమాచారం మేరకు మణిపూర్ పోలీసులతో కలిసి ఆర్మీ, అస్సాం రైఫిల్స్, బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, ఇండో–టిబెటన్ సరిహద్దు పోలీసులు తనిఖీలు చేశారు(Manipur). భద్రతాదళాల తనిఖీల్లో 328 తుపాకులతో పాటు 151 సెల్ఫ్ లోడింగ్ రైఫిల్స్, ఇతరత్రా ఆయుధాలు లభించినట్లు తెలిపారు. రెండేళ్ల క్రితం మైతీ, కుకీ తెగల మధ్య మొదలైన ఘర్షణలతో మణిపూర్ అట్టుడికిన విషయం తెలిసిందే. అయితే ఆ ఘర్షణల్లో రెండు తెగల వద్ద భారీగా ఆయుధాలు ఉన్నట్లు గుర్తించారు.
Also Read :
- Gujarat: రెండు సార్లు టికెట్ క్యాన్సిల్ మూడో సారి మృత్యు ఒడికి
- Ahmedabad: విమాన ప్రమాదంపై దర్యాప్తుకు హైలెవల్ కమిటీ

