Delhi: టెంపోలో ఫ్రంట్ సీట్ ఇవ్వలేదని తండ్రిని కాల్చేసిండు

కారు ఫ్రంట్​సీట్ ​కోసం యువకుడు కన్న తండ్రినే చంపేశాడు. ఈ ఘటన ఢిల్లీలో(Delhi) చోటుచేసుకుంది. సురేంద్ర సింగ్​(60), దీపిక్​(26) తండ్రీ కొడుకులు. సరేంద్ర సింగ్​ సీఐఎస్ ఎఫ్​ ఎస్​ఐ గా పనిచేసి ఇటీవల రిటైర్​అయ్యారు. ఈ క్రమంలో వారు ఢిల్లీ(Delhi) నుంచి సొంతూరు ఉత్తరాఖండ్​కు వెళ్లేందుకు ఓ టెంపోను అద్దెకు తీసుకున్నారు. ఈ క్రమంలో ఫ్రంట్​సీట్​లో ఎవరు కూర్చోవాలనేదానిపై తండ్రీ కొడుకులు గొడవ పడ్డారు. ఆవేశంలో దీపక్​ తన తండ్రిని ఆయన లైసెన్స్​డ్​ గన్​తోనే కాల్చి చంపారు. కొద్ది దూరంలోనే ఉన్న పోలీసులు ఈ గన్​సౌండ్​ విని పోలీసులు అక్కడకు చేరుకున్నారు. అనంతరం దీపక్ చేతిలో ఉన్న గన్​ని స్వాధీనం చేసుకుని అతడిని అరెస్టు చేశారు. ఆపై సురేంద్ర సింగ్‌ను హాస్పిటల్‌కు తరలించారు. కానీ అప్పటికే ఆయన మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read :