తెలంగాణలో ఇటీవల కలకలం రేపుతున్న స్వర్ణకారుల ఆత్మహత్యలు పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kavitha) తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల విచారణ, తప్పుడు ఆరోపణల నేపథ్యంలో స్వర్ణకారులు సూసైడ్కు పాల్పడుతున్నారనే వాస్తవం కలిచివేస్తోందని ఆమె (Kavitha) అన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం, పోలీసులు సానుభూతితో స్పందించాల్సిన అవసరం ఉందని తెలిపారు.
స్వర్ణకారుల వృత్తి ప్రమాదంలో పడకూడదు
కవిత వెల్లడించిన వివరాల ప్రకారం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇటీవల దొంగతనాలకు సంబంధించిన కేసుల్లో బంగారం కొనుగోలు చేసిన స్వర్ణకారులే మొదటిగా విచారణకు గురవుతున్నారు. ఇది నేరవార్తలు వచ్చిన ప్రతీసారీ చూస్తున్న దురదృష్టకరమైన వ్యవహారం.
IPC సెక్షన్ 411 (తప్పుడు స్వాధీనం) ప్రకారం పోలీసులు స్వర్ణకారులపై కేసులు నమోదు చేస్తున్నారు. దొంగలు దొరకకపోయినా, బంగారం కొనుగోలు చేసిన స్వర్ణకారులపై నేరబాధ్యత మోపడం అన్యాయమని కవిత తెలిపారు. అందుకే ఈ చట్టాన్ని తిరిగి సమీక్షించాలని ఆమె డిమాండ్ చేశారు.
ఆత్మహత్యల వెనుక సామాజిక అసురక్షితత
ఇటీవల నిజామాబాద్, వరంగల్, విజయవాడ, అనంతపురం వంటి ప్రాంతాల్లో స్వర్ణకారులు తప్పుడు కేసులకు భయపడి ఆత్మహత్యలకు పాల్పడటం బాధాకరమైన విషయం. కుటుంబ పోషణ కోసం సంప్రదాయ వృత్తిగా బంగారం కొనుగోలు, అమ్మకాలు చేసే వారిని నేరస్తులుగా చూడకూడదని, వారి వృత్తికి రక్షణ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని కవిత స్పష్టం చేశారు.
విశ్వకర్మల కోసం విధాన మార్పులు అవసరం
ఈ సందర్భంగా ఆమె విశ్వకర్మ వర్గాలకు సాంకేతికంగా ప్రోత్సహించే విధంగా సబ్సిడీ రుణాలు, ఉచిత శిక్షణా కేంద్రాలు, నూతన పథకాల ఆవశ్యకతను గుర్తు చేశారు. కార్పొరేట్ సంస్థలతో పోటీ పడే స్థాయికి చేర్చేలా ప్రభుత్వం చేయూత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
వీడియో సందేశం ద్వారా వేడుకోలు
ఈ సందర్బంగా కవిత ఒక వీడియో సందేశం విడుదల చేశారు. “వృత్తి పరంగా బంగారం కొనుగోలు చేసినంత మాత్రాన ఎవరూ నేరస్థులు కావు. వృత్తిపట్ల భయంతో ఆత్మహత్య చేసుకోకండి. మనం అంతా కలిసి పోరాడాలి, చట్టాన్ని మార్చించాలి” అంటూ ఆమె పిలుపునిచ్చారు.
Also read:

