Kishan Reddy:9 వేల ఎకరాల్లో వాణిజ్య సముదాయాలు

Kishan Reddy

(Kishan Reddy) 9 వేల ఎకరాల్లో వాణిజ్య సముదాయాలు వస్తే ట్రాఫిక్ నియంత్రణ ఎలా? హైదరాబాద్ నగర అభివృద్ధి పై రాజకీయ స్థాయిలో కొత్త చర్చ మొదలైంది.రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పారిశ్రామిక విధానం, భూవ్యవహారాలపై కేంద్ర మంత్రి (Kishan Reddy) కిషన్ రెడ్డి సీరియస్ కామెంట్లు చేశారు.ప్రత్యేకంగా నగర పరిధిలో 9 వేల ఎకరాల్లో కమర్షియల్ కాంప్లెక్స్‌లు నిర్మించాలనే ప్రతిపాదనపై ఆయన తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తం చేశారు.

కిషన్ రెడ్డి మాట్లాడుతూ…9 వేల ఎకరాలు అంటే చిన్న విషయం కాదు.అంత పెద్ద విస్తీర్ణంలో కమర్షియల్ భవనాలు, ఆఫీస్ స్పేసులు, షాపింగ్ హబ్‌లు, బిజినెస్ జోన్లు వస్తే…మొత్తం నగర ట్రాఫిక్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుందని హెచ్చరించారు.

హైదరాబాద్ ఇప్పటికే ట్రాఫిక్ సమస్యలతో అల్లాడుతోంది.అన్ని ప్రధాన రోడ్లపై భారీ వాహన రద్దీ ఉంది.
అలాంటి నగరంలో మరో 9 వేల ఎకరాలు పూర్తిగా వాణిజ్య అవసరాలకు కేటాయిస్తే పరిస్థితి మరింత క్లిష్టమవుతుందని ఆయన అన్నారు.”ఈ ట్రాఫిక్‌ని ఎలా కంట్రోల్ చేస్తారు? ప్రజలు ఎలా ప్రయాణిస్తారు?” అని ప్రశ్నించారు.

Image

ఇక మరో కీలక అంశాన్ని కూడా కిషన్ రెడ్డి లేవనెత్తారు.నగర పరిధిలో ఉన్న 22 పారిశ్రామిక వాడలను బయటకు తరలించాలనే ప్రభుత్వ ఆలోచనపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.ఈ వాడల్లో వేల సంఖ్యలో కార్మికులు పనిచేస్తున్నారని గుర్తుచేశారు.వారిని నగర బయటకు పంపితే—వారి జీవన విధానం కష్టంలో పడుతుందని, ప్రయాణాలు పెరుగుతాయని, జీవన భారం మరింత పెరుగుతుందని అన్నారు.”ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోండి” అని సీఎం రేవంత్ రెడ్డికి సూచించారు.

Image

కిషన్ రెడ్డి ప్రభుత్వం కొత్త పారిశ్రామిక విధానం తీసుకురావడాన్ని కూడా తీవ్రంగా విమర్శించారు.
ఈ విధానం వెంటనే ఉపసంహరణ చేయాలని డిమాండ్ చేశారు.రాష్ట్రంలో ఇన్సైడర్ ట్రేడింగ్ భారీగా జరగబోతోందని ఆరోపించారు.పెద్ద పారిశ్రామిక వేత్తలకు వేల ఎకరాలను అప్పగించేందుకు ప్రభుత్వం ప్రణాళిక చేస్తున్నదని అన్నారు.

అలాగే 9 వేల ఎకరాలను “కొంతమందికి దారాదత్తం చేసే కుట్ర”గా అభివర్ణించారు.పారిశ్రామిక భూముల క్రమబద్ధీకరణ పేరుతో జరుగుతున్నది భూదందాకే సంకేతమని చెప్పారు.”రాజకీయ ప్రభావం ఉన్న వారు అధికారాన్ని ఉపయోగించి భూములు స్వాధీనం చేసుకునే పరిస్థితి తయారవుతోంది” అని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Image

భూముల వ్యవహారాలతో పాటు, కిషన్ రెడ్డి మరో అంశాన్ని కూడా ప్రస్తావించారు.సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యలు హిందూసమాజభావాలనుదెబ్బతీస్తున్నాయనిఅన్నారు.అలాంటివ్యాఖ్యలుఅహంకారపూరితమైనవని, ప్రజా నాయకుడిగా ఆయన మరింత బాధ్యతాయుతంగా మాట్లాడాలని సూచించారు.దేవుళ్లపై చేసిన వ్యాఖ్యలకు రేవంత్ రెడ్డి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.

Image

ఈ మొత్తం పరిస్థితే తెలంగాణ రాజకీయాల్లో కొత్త వాదనలకు దారితీసింది.భవిష్యత్‌లో ప్రభుత్వం భూవ్యవస్థపై ఏమి నిర్ణయం తీసుకుంటుందో, పారిశ్రామిక విధానం మారుతుందా లేదా అనేది ఆసక్తిగా మారింది.

Also read: