Laxman : తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ను తాము కూల్చబోమని, ఎవరైనా కూలగొడితే తాము కాపాడబోమని బీజేపీ ఎంపీ లక్ష్మణ్(Laxman) అన్నారు. జగిత్యాలలో జరిగిన బీజేపీ విజయ సంకల్ప సభలో ఆయన మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల తరువాత తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ కు మార్గం సుగమం అవుతుందన్నారు. దేశంలో ఎక్కడా లేని కాంగ్రెస్ తెలంగాణలో అవసరమా? అని ప్రశ్నించారు. గేట్లు తెరిచామని సీఎం రేవంత్ అంటున్నారని ఆయన పార్టీ ఎమ్మెల్యేలు వెళ్లి పోకుండా చూసుకోవాలని లక్ష్మణ్(Laxman) సూచించారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పారిపోయేలా ఉన్నారని, వారిని కాపాడుకోవాలన్నారు. ఆరు గ్యారెంటీలు ఇస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు వంద రోజులైనా హామీలు అమలుచేయడం లేదని విమర్శించారు. రేవంత్ .. కేసీఆర్ను మరిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. మాటలు చెప్పడంలో కేసీఆర్ ను రేవంత్ మించి పోయాడని ఆయన దెప్పి పొడిచారు
Also Read:

