MP Aravind: కాంగ్రెస్​ కు 30 కూడా సీట్లు డౌటే

MP Aravind

ప్రధాని మోదీ తీసుకొచ్చిన రాజ్యాంగ చట్టం సీఏఏను అడ్డుకుంటే జైలుకు వెళ్లడం ఖాయమని ఎంపీ ధర్మపురి అర్వింద్​ (MP Aravind)  అన్నారు. ఇవాళ నిజామాబాద్​లోని దుబ్బ ప్రాంతంలో చాయ్​పే చర్చ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యంగ వ్యతిరేక పాలన చేస్తే రాష్ట్రపతి పాలన ఉందంటూ సీఏఏనే వ్యతిరేకిస్తున్న నేతలకు వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలో ఆరు గ్యారంటీలను అమలు చేయని కాంగ్రెస్​ దేశంలో 2 లక్షల రుణమాఫీ ఎలా చేస్తుందని ఎంపీ ఆర్వింద్ (MP Aravind) ప్రశ్నించారు.

ఓట్ల కోసం దేవుని పేరు చెబుతున్న కాంగ్రెస్​ సీఏఏ, ఎన్​ఆర్సీకి ఎందుకు ఒప్పుకోవడం లేదని నిలదీశారు. ఓట్ల కోసమే కాంగ్రెస్​ జైశ్రీరామ్ అంటుందోని ఎంపీ అర్వింద్​ విమర్శించారు. సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళన చేసి కాంగ్రెస్​ అభ్యర్థి జీవన్​ రెడ్డికి హిందువుల ఓట్లు అడిగే అర్హత లేదన్నారు. పాతబస్తీలో బీజేపీని ఓడించేందుకు డమ్మీ అభ్యర్థిని కాంగ్రెస్​ నిలబెడుతుందని ఆరోపించారు. ​మోదీని మూడోసారి పీఎంగా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. నిజామాబాద్​కు ఐసీడీని తెచ్చే ప్రయత్నం చేస్తానని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీయే సీట్లు 400 దాటుతాయన్నారు. కాంగ్రెస్​ కు 30 సీట్లు కూడా వచ్చేది అనుమానమేనని ఆయన అన్నారు.

ప్రధాని మోదీ తీసుకొచ్చిన రాజ్యాంగ చట్టం సీఏఏను అడ్డుకుంటే జైలుకు వెళ్లడం ఖాయమని ఎంపీ ధర్మపురి అర్వింద్​ (MP Aravind)  అన్నారు. ఇవాళ నిజామాబాద్​లోని దుబ్బ ప్రాంతంలో చాయ్​పే చర్చ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యంగ వ్యతిరేక పాలన చేస్తే రాష్ట్రపతి పాలన ఉందంటూ సీఏఏనే వ్యతిరేకిస్తున్న నేతలకు వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలో ఆరు గ్యారంటీలను అమలు చేయని కాంగ్రెస్​ దేశంలో 2 లక్షల రుణమాఫీ ఎలా చేస్తుందని ఎంపీ ఆర్వింద్ (MP Aravind) ప్రశ్నించారు.

ఓట్ల కోసం దేవుని పేరు చెబుతున్న కాంగ్రెస్​ సీఏఏ, ఎన్​ఆర్సీకి ఎందుకు ఒప్పుకోవడం లేదని నిలదీశారు. ఓట్ల కోసమే కాంగ్రెస్​ జైశ్రీరామ్ అంటుందోని ఎంపీ అర్వింద్​ విమర్శించారు. సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళన చేసి కాంగ్రెస్​ అభ్యర్థి జీవన్​ రెడ్డికి హిందువుల ఓట్లు అడిగే అర్హత లేదన్నారు. పాతబస్తీలో బీజేపీని ఓడించేందుకు డమ్మీ అభ్యర్థిని కాంగ్రెస్​ నిలబెడుతుందని ఆరోపించారు. ​మోదీని మూడోసారి పీఎంగా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. నిజామాబాద్​కు ఐసీడీని తెచ్చే ప్రయత్నం చేస్తానని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీయే సీట్లు 400 దాటుతాయన్నారు. కాంగ్రెస్​ కు 30 సీట్లు కూడా వచ్చేది అనుమానమేనని ఆయన అన్నారు.

 

Also read: