పతంజలి (Pathanjali)సంస్థ వ్యవస్థాపకుడు, యోగా గురువు రాందేవ్ బాబాపై ఆ సంస్థ ఎండీ ఆచార్య బాలకృష్ణపై దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. తప్పుదోవ పట్టించే ప్రకటనలకు సంబంధించిన కోర్టు ధిక్కరణ వ్యాజ్యంపై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. కోర్టు ఆదేశాల మేరకు నేటి విచారణకు కూడా రాందేవ్ బాబా, బాలకృష్ణ వ్యక్తిగతంగా హాజరయ్యారు. ఈ సందర్బంగా జస్టిస్ హిమా కోహ్లీ, అహసనుద్దీన్ అమానుల్లా నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘మీరు గత ఉత్తర్వుల్లో న్యాయస్థానం ఏం చెప్పిందో తెలుసుకోలేనంత అమాయకులు కాదంటూ మండిపడింది. తమ తప్పును అంగీకరిస్తూ వారం రోజుల్లోగా బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆదేశించింది. దీంతో వీరిద్దరూ వీరిద్దరూ న్యాయస్థానంలో మరోసారి బేషరతుగా క్షమాపణలు తెలియజేశారు. ‘‘ఆ సమయంలో మేం చేసింది తప్పిదమే. భవిష్యత్తులో ఇలా జరగకుండా జాగ్రత్తగా ఉంటాం. కోర్టు ఆదేశాలను అగౌరవపర్చాలన్న ఉద్దేశం మాకు లేదు’ అంటూ కోర్టుకు తెలిపారు.
Also read:
Samyuktha Menon : ఇక హిందీ సినిమాల్లోనా?

