ఢిల్లీ(Delhi)లో ఒకే సారి 100 పాఠశాలలకు బాంబు బెదిరింపు మెయిల్స్ రావడం కలకలం రేపింది. బుధవారం ఉదయం ఈ మెయిల్స్ వచ్చాయి. అప్రమత్తమైన స్కూల్ యాజమాన్యాలు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చాయి. ముందు జాగ్రత్త చర్యగా బడులను ఖాళీ చేయించాయి. పోలీసులు బాంబ్ స్క్వాడ్తో తనిఖీలు చేస్తున్నారు. ద్వారక, చాణక్యపురి, మయూర్ విహార్, వసంత్ కుంజ్, సాకేత్తో పాటు నోయిడాలోని కనీసం 12 పాఠశాలలకు ఈ-మెయిల్ వచ్చినట్లు తెలుస్తోంది. కొన్ని స్కూళ్లలో ఈ రోజు పరీక్షలు జరుగుతున్నాయి. బెదిరింపుల నేపథ్యంలో వాటిని మధ్యలోనే ఆపి విద్యార్థులను ఇంటికి పంపించారు. తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే వారు ఆయా స్కూళ్లకు చేరుకుని పిల్లలను తీసుకెళ్లారు. ప్రస్తుతం ఈ పాఠశాలల ప్రాంగణాల్లో పోలీసులు బాంబ్ డిటెక్షన్ బృందంతో తనిఖీలు చేస్తున్నాయి. అగ్నిమాపక సిబ్బంది కూడా చేరుకున్నారు. ఇప్పటివరకు ఎలాంటి అనుమానాస్పద, పేలుడు పదార్థాలు లభించలేదని తెలుస్తోంది. బెదిరింపులకు పాల్పడిన ఈ-మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Also read :
Godrej : గోద్రేజ్ ఫ్యామిలీ విడిపోయింది
Raj Singh : దిగొచ్చిన రాజాసింగ్

