Phone Tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసు సీబీఐకి ఇవ్వాలి

Phone tapping case

ఫోన్ ట్యాపింగ్‌ కేసును (Phone Tapping case) సీబీఐకి అప్పగించాలని బీజేపీ ఎంపీ లక్ష్మణ్​డిమాండ్​చేశారు. ​బాధితుడిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు సైలెంట్​గా ఉన్నారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు(Phone Tapping case) . ఢిల్లీలో లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ ‘ఫోన్​ట్యాపింగ్​కేసులో సంచలనాలు బయటకొస్తున్నాయి. గత బీఆర్ఎస్ సర్కార్​దేశ ద్రోహానికి పాల్పడింది. దీనిపై కాంగ్రెస్​ది మెతక వైఖరి. సీఎం రేవంత్​రెడ్డి ఢిల్లీ పెద్దల ఒత్తిడిలకు లొంగిపోయారా? కేసీఆర్ తన కూతురు కవితను లిక్కర్ స్కామ్ కేసు నుంచి తప్పించేందుకే ఫోన్ ట్యాపింగ్ చేయించిండు. ఢిల్లీ పెద్దలను ఇరికించి తన కూతురుని లిక్కర్ స్కామ్ కేసు నుంచి బయట పడేయాలని ప్లాన్​చేసిండు. వ్యక్తిగత స్వేచ్ఛను హరించే హక్కు గత బీఆర్ఎస్​ ప్రభుత్వానికి ఎవరిచ్చారు? అందెశ్రీ పాట విషయంలో మాకు ఎలాంటి ఇబ్బంది లేదు’ అని లక్ష్మణ్​స్పష్టం చేశారు.

Also read: