BENGAL :బెంగాల్ లో ఉద్రిక్తత

లోక్ సభ చివర దశ ఎన్నికల వేళ.. బెంగాల్‌(BENGAL)లో ఉద్రిక్తతలు పరిస్థితులు నెలకొన్నాయి. సౌత్24 పరగణాల జిల్లాలోని కుల్తాలీలో కొందరు పోలింగ్ కేంద్రంలోకి చొచ్చుకెళ్లి.. ఎన్నికల సామగ్రిని చెల్లాచెదురుగా పడేశారు. ఈవీఎంలు, వీవీప్యాట్‌ మెషీన్లను దగ్గర్లోని నీటి కుంటలో పడేశారు. దీంతోపాటు జాదవ్‌పూర్‌ నియోజకవర్గం పరిధిలోని భాంగర్‌లో.. ఐఎస్‌ఎఫ్‌, సీపీఐ(ఎం) మద్దతుదారుల మధ్య ఘర్షణ జరిగింది. ఘటనలో పలువురు గాయపడ్డారు. దీంతో అక్కడ అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక ఏడో దశలో కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్‌ తోపాటు బీహార్, హిమాచల్‌ప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లోని 57 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ కొనసాగుతోంది. ఈ దశలో మొత్తం 904 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. దాదాపు10 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇక ఒడిశాలో 42 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. అదే విధంగా హిమాచల్‌ ప్రదేశ్‌లోని ఆరు అసెంబ్లీ స్థానాలకు, బీహార్‌, ఉత్తరప్రదేశ్‌, బెంగాల్‌లో(BENGAL) ఒక్కొక్కటి చొప్పున అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నిక జరుగుతోంది.
ఓటేసిన ప్రముఖులు
హిమాచల్‌ సీఎం సుఖ్‌విందర్‌ సింగ్‌, యూపీ సీఎం యోగి ఆద్యితనాథ్‌, పంజాబ్‌ సీఎం భగవంత్ మాన్, బీహార్‌ సీఎం నితిశ్‌ కుమార్‌ తమ తమ రాష్ట్రాల్లో ఓటు వేశారు. ఆర్జీడీ చీఫ్ లాలు, ఆయన కుటుంబం సభ్యులు పాట్నాలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. హిమాచల్ ప్రదేశ్‌లోని బిలాస్‌పూర్‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌, మాజీ క్రికెటర్‌, ఆప్‌ ఎంపీ హర్బజన్‌ సింగ్‌ లు పోలింగ్ లో పాల్గొన్నారు. వీరితో పాటు పలువురు కేంద్ర మంత్రులు, కీలక నేతలు పోలింగ్ లో పాల్గొన్నారు. పంజాబ్‌లో బీజేపీ నేత తరుణ్‌చుగ్‌ ఓటు వేశారు.

ALSO READ :