DELHI ED OFFICE: ఈడీ ఆఫీసు వద్ద టెన్షన్ టెన్షన్

DELHI ED OFFICE
  • కవితను అరెస్టు చేస్తారా..? అనే ఉత్కంఠ
  • భారీగా చేరుకున్న పోలీసులు
  • వైద్యుల ప్రత్యేక బృందంతో కూడిన వాహనం కూడా

ఢిల్లీలోని ఈడీ ఆఫీస్(DELHI ED OFFICE) ఎదుట హై టెన్షన్ నెలకొంది. ఎమ్మెల్సీ కవిత ఉదయం నుంచి విచారణ ఎదుర్కొంటున్నారు. సాయంత్రం సమయానికి కవిత తరపున ముగ్గురు న్యాయవాదులతోపాటు.. ఇద్దరు డాక్టర్లు ఈడీ ఆఫీసు(DELHI ED OFFICE)లోకి వెళ్లటంతో ఉత్కంఠ నెలకొంది. అర గంట గ్యాప్ లోనే.. ఆరు గంటల సమయంలో ఇద్దరు డాక్టర్ల బృందం ఈడీ ఆఫీసులోకి వెళ్లింది. అర్ధగంట తర్వాత డాక్టర్ల బృందం బయటకు వెళ్లిపోయింది. ఇందులో ఒకరు మహిళా డాక్టర్ ఉన్నారు. ప్రస్తుతం ఈడీ ఆఫీసు వద్ద నాలుగు వాహనాలతో ఢిల్లీ పోలీసుల ఎస్కార్ వాహనం సిద్ధంగా ఉంది.  ఏం జరుగుతుందనే ఆందోళన బీఆర్ఎస్ శ్రేణుల్లో నెలకొంది.

దీంతో బారీ సంఖ్యలో బీఆర్ఎస్ శ్రేణులు ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయం వద్దకు చేరుకుంటున్నాయి. ఇటు రాష్ట్రంలోనూ ఉత్కంఠ పరిస్థితి నెలకొంది. ఆమె అభిమానులు, టీఆర్ఎస్ శ్రేణులు టీవీలకు అతుక్కుపోయి ఇండియా–పాకిస్తాన్ మ్యాచ్ కంటే ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.ఇవాళ (మార్చి 20,2023) ఉదయం 10 గంటల 30 నిమిషాల నుంచి ఈడీ విచారణలోనే ఉన్నారు కవిత. సాయంత్రం ఆరు గంటల తర్వాత.. లాయర్లు, డాక్టర్లను ఈడీ అధికారులు పిలిపించటం.. ఆ వెంటనే బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ లేఖ విడుదల చేయటం వంటి పరిణామాలు చకచకా జరిగిపోయాయి.

ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు మంత్రి కేటీఆర్. ఆయనతోపాటు మరికొంత మంది బీఆర్ఎస్ మంత్రులు వెంట ఉన్నారు. ఈడీ ఆఫీసుకు భారీ సంఖ్యలో బీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలు చేరుకుంటున్నారు. ఈ క్రమంలోనే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. బారికేడ్లతో కార్యకర్తలను అడ్డుకుంటున్నారు. ఆఫీసు పరిసరాల్లో ఎవరూ ఉండొద్దని.. అందరూ దూరంగా వెళ్లిపోవాలని పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

ఈడీ ఆఫీసుకు లాయర్లెందుకు వచ్చారు?

ఈడీ ఆఫీసులో విచారణలో ఉన్న ఎమ్మెల్సీ కవిత దగ్గరకు ఆమె లాయర్లు వెళ్లారు. ఢిల్లీలోనే ఉన్న అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు, సీనియర్ అడ్వకేట్లు సోమ భరత్, గండ్ర మోహనరావు సాయంత్రం ఐదు గంటల సమయంలో ఈడీ ఆఫీసుకు చేరుకున్నారు. మార్చి 20వ తేదీ ఉదయం 10 గంటల 30 నిమిషాలకు కవిత ఈడీ ఆఫీసులోకి వెళ్లారు. అప్పటి నుం

చి విచారణను ఎదుర్కొంటున్నారు.

అంత హడావుడి ఎందుకు?

ఈడీ ఆఫీసుకు సాయంత్రం సమయంలో సీనియర్ అడ్వకేట్లు చేరుకోవటం ఆసక్తిగా మారింది. అంత హడావిడిగా వారు రావటం ఏంటనే ప్రశ్నలు తలెత్తున్నాయి. లిక్కర్ స్కాం కేసు విచారణకు సంబంధించి ఇప్పటికే తన లాయర్ల కవిత లేఖ కూడా రాశారు. ఇప్పుడు విచారణ జరుగుతున్న సమయంలో వీరు ఆఫీసులోకి వెళ్లటం ద్వారా ఏమై ఉంటుంది అనేది ప్రశ్నగా మారింది. ఈడీ ఆఫీసు ఎదుట భారీగా పోలీసులు మోహరించారు. కార్యకర్తలను చెదరగొడతున్నారు. దీంతో ఏ క్షణం ఏం జరుగుతుందో అనే టెన్షన్ నెలకొంది. ఓ వైపు భారీ వర్షం కురుస్తున్నా.. ఆమె అభిమానులు, మీడియా ప్రతినిధులు బయటే వేచి ఉన్నారు.

ALSO READ