RAIN :గోదావరి గలగల.. కృష్ణమ్మ బిరబిర

రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు(RAIN) కురుస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో అశ్వారావుపేట మండలం గుమ్మడివల్లి సమీపంలోని పెద్దవాగు ప్రాజెక్టుకు నిన్న అర్దరాత్రి భారీ గండింది. ఇంద్రావతి, పేరూరు వైపు నుంచి వరద రావడంతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం పెరగడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. తాలిపేరు ప్రాజెక్టు 24 గేట్లు ఎత్తి 59,330 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇల్లందు, కోయగూడెం ఉపరితలగనిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో గురువారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు ఎదులబంధం అడవిలోని తుతుంగా ప్రాజెక్టు వద్ద గల రోడ్డు పూర్తిగా తెగిపోయింది. ఎదులబంధం, సిర్సా, పుల్లగామ, రొయ్యలపల్లి, ఆలుగామ, జనగామ, వెంచపల్లి, సూపాక, నంద్రంపల్లి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని దామెరుకుంట-, గుండ్రాత్ పల్లి మధ్యలోని అలుగు వాగులో ఇవాళ బొలెరో ట్రాలీ వెహికిల్ కొట్టుకుని పోయింది. మహాముత్తారం మండలంలోని పెద్దవాగు ఉదృతంగా ప్రవహించడంతో కాటారం, మేడారం ప్రధాన రహదారి కావడంతో రాకపోకలు నిలిచిపోయాయి. కాటారం – మేడారం ప్రధాన రహదారిపై కొర్లకుంట వద్ద వంతెనపై నుంచి కారు అదుపుతప్పి వాగులో పడింది. మానేరు, చలివాగు ఉగ్ర రూపం దాల్చడంతో పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద గోదావరి, ప్రాణహిత ఉధృతంగా ప్రవహిచడంతో 7 మీటర్ల పైగా ఎత్తులో వరద కొనసాగుతోంది. మేడిగడ్డ బ్యారేజీకి 1,93,550 క్యూసెక్కుల నీరు చేరుతున్నది. అధికారులు 85 గేట్లు ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు. జూరాల, కడెం ప్రాజెక్టులకు వరద ప్రవాహం పెరుగుతున్నది. కాగతా దక్షిణ, ఉత్తర(RAIN ) బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది. రానున్న 12 గంటల్లో ఇది వాయుగుండగా మారే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆసిఫాబాద్‌, మంచిర్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, వరంగల్‌, హనుమకొండ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే వీలుందని తెలిపింది. గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టులోకి 20 వేల క్యూసెక్కుల ఇన్‌ ఫ్లో వస్తుండగా, 22,877 క్యూసెక్కుల నీటిని ఔట్‌ ఫ్లో గా వదులుతున్నారు. పూర్తి స్థాయి నీటిమట్టం 318.516 మీటర్లకు గాను ప్రస్తుతం315.850 మీటర్ల నీటిమట్టం ఉంది. 9.657 టీఎంసీలకు గాను 4.951 టీఎంసీలు నీరు నిల్వ ఉంది. నిర్మల్‌ జిల్లా కడెం జలాశయానికి 5,437 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. జలాశయానికి పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 688.35 అడుగులకు చేరింది.

పెద్దవాగు ప్రాజెక్టుకు గండి (బాక్స్​)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో అశ్వారావుపేట మండలం గుమ్మడివల్లి సమీపంలోని పెద్దవాగు ప్రాజెక్టుకు వరద పోటెత్తడంతో నిన్న అర్దరాత్రి భారీ గండింది. రాత్రంతా నీరు దిగువకు వెళ్లడంతో ప్రాజెక్టు ఖాళీ అయింది. అశ్వారావుపేట మండలం గుమ్మడవల్లి, కోయరంగాపురం, కొత్తూరు, రమణక్కపేట గ్రామాలకు పాక్షికంగా నష్టం జరగ్గా ఏపీలోని ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం కమ్మరిగూడెం, ఒంటిబండ, కోయమాదారం, కొత్తపూచిరాల, పాతపూచిరాల, అల్లూరినగర్, సొందిగొల్లగూడెం, వసంతవాడ, గుళ్లవాయి, వేలేరుపాడు గ్రామాలకు భారీగా నష్టం సంభవించింది. వేల ఎకరాల్లో పంట దెబ్బతిన్నది. వందల సంఖ్యలో పశువులు కొట్టుకుపోయాయి. పలు గ్రామాల ప్రజలు కొండలు, ఎత్తయిన భవనాల్లో రాత్రంతా తలదాచుకున్నారు. ఏం జరుగుతుందో తెలియక పరుగులు తీశారు. గ్రామాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో సహాయక చర్యలకు వీలు లేకుండా పోయింది.

తీవ్ర అల్పపీడనం.. జిల్లాలకు భారీ వర్షసూచన (బాక్స్​)
దక్షిణ, ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది. రానున్న 12 గంటల్లో ఇది వాయుగుండగా మారే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణలోని ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌ జిల్లాల్లో అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. కుమురం భీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, వరంగల్‌, హనుమకొండ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే వీలుందని తెలిపింది. హైదరాబాద్‌లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది.

ALSO READ :