డిసెంబర్ ఫస్ట్వీక్లో మహిళా శక్తి వారోత్సవాలు నిర్వహిస్తామని మంత్రి సీతక్క(Seethakka) అన్నారు. బ్యాంకుల నుంచి వడ్డీ లేని రుణాలను మహిళా సంఘాలకు ఇప్పించేలా ప్రత్యేక డ్రైవ్ చేపడతామని తెలిపారు.మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులపై డీఆర్డీవోలతో సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వచ్చే ఐదు మాసాల్లో చేయాల్సిన పనులపై సమీక్షించారు(Seethakka). నిర్దేశించుకున్న గడువులోపు పనులు పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. మార్చిలోపు ఉపాధి హామీ పనుల కోసం రూ. 1372 కోట్ల నిధులు మంజూరుచేశామని తెలిపారు. మహిళలకు ఉపాధి భరోసా, పంట పొలాలకు బాటలు, పండ్ల తోటల పెంపకం, ఇంకుడు గుంతలు, గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, స్వచ్చ భారత్ మిషన్ కోసం ఉపాధి నిధులు వెచ్చించేలా క్షేత్రస్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ‘గ్రామ సభలు విధిగా నిర్వహించి వాటిలో ప్రజల భాగస్వామ్యం పెంచాలి. గ్రామస్తుల అభిప్రాయాలకు అనుగుణంగా ఉపాధి పనులను చేపట్టాలి. ప్రతి ఇంటిలో టాయిలెట్ ఉండేలా చర్యలు చేపట్టాలి. చెక్ డ్యాంల నిర్మాణం, పంట కాలువల్లో పూడికతీత పనుల్లో వేగం పెంచాలి.
మహిళలకు ఆర్థిక భరోసా కల్పించడమే ఇందిరా మహిళా శక్తి ముఖ్య ఉద్దేశం. ప్రతి మహిళను స్వయం సహాయక సంఘాల్లో చేర్పించాలి’ అని సీతక్క సూచించారు.
Also Read :

