ఈ నెల 8న మూసీ పరిస్థితిని ప్రజలకు వివరించేందుకు (CM Revanth) సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయనున్నారు. వలిగొండ–బీబీనగర్ మధ్య ఆరు కిలోమీటర్ల మేర మూసీ వెంటనడుస్తూ అక్కడి కాలుష్యం పరిస్థితిని ప్రజలకు వివరించనున్నారు. అనంతగిరి కొండల్లో పుట్టిన మూసీ నది.. హైదరాబాద్ లోని మురికి నీరు, ఫ్యాక్టరీల వ్యర్థాలను కలుపుకొని అధ్వాన స్థితిలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోకి ప్రవేశిస్తుంది. కాలుష్యంతో కూడిన ఆ నీటి కారణంగా పరీవాహక ప్రాంతంలో పంటలు కూడా పండని దుస్థితి ఏర్పడిందని పలుమార్లు (CM Revanth) సీఎం చెప్పారు.
పశువుల పాలు కూడా ఎర్రగా వస్తున్నాయని స్థానిక నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై బీఆర్ఎస్, బీజేపీ చేస్తున్న రాజకీయ విమర్శలను తిప్పికొట్టేందుకు, ప్రజలకు వాస్తవ పరిస్థితిని, ఉమ్మడి నల్లగొండ జిల్లా వాసులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను విడమర్చి చెప్పేందుకు సీఎం సిద్ధమయ్యారు. మూసీ పునరుద్ధరణ తర్వాత మల్లన్నసాగర్ నుంచి నీటిని తీసుకొచ్చి నింపి స్వచ్ఛమైన నీటిని నదిలో పారించాలనే తలంపుతో ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మూసీ పునరుజ్జీవం ఆవశ్యకతను ప్రజలకు వివరించేందుకు ఈ నెల 8న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ బాట పట్టనున్నారు.
ఈ నెల 8న మూసీ పరిస్థితిని ప్రజలకు వివరించేందుకు సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయనున్నారు. వలిగొండ–బీబీనగర్ మధ్య ఆరు కిలోమీటర్ల మేర మూసీ వెంటనడుస్తూ అక్కడి కాలుష్యం పరిస్థితిని ప్రజలకు వివరించనున్నారు. అనంతగిరి కొండల్లో పుట్టిన మూసీ నది.. హైదరాబాద్ లోని మురికి నీరు, ఫ్యాక్టరీల వ్యర్థాలను కలుపుకొని అధ్వాన స్థితిలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోకి ప్రవేశిస్తుంది. కాలుష్యంతో కూడిన ఆ నీటి కారణంగా పరీవాహక ప్రాంతంలో పంటలు కూడా పండని దుస్థితి ఏర్పడిందని పలుమార్లు సీఎం చెప్పారు. పశువుల పాలు కూడా ఎర్రగా వస్తున్నాయని స్థానిక నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై బీఆర్ఎస్, బీజేపీ చేస్తున్న రాజకీయ విమర్శలను తిప్పికొట్టేందుకు, ప్రజలకు వాస్తవ పరిస్థితిని, ఉమ్మడి నల్లగొండ జిల్లా వాసులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను విడమర్చి చెప్పేందుకు సీఎం సిద్ధమయ్యారు. మూసీ పునరుద్ధరణ తర్వాత మల్లన్నసాగర్ నుంచి నీటిని తీసుకొచ్చి నింపి స్వచ్ఛమైన నీటిని నదిలో పారించాలనే తలంపుతో ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మూసీ పునరుజ్జీవం ఆవశ్యకతను ప్రజలకు వివరించేందుకు ఈ నెల 8న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ బాట పట్టనున్నారు.
Also read:

