పీజీ మెడికల్ కాలేజీ సీట్లు అక్రమంగా విక్రయించారనే అభియోగాలపై మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే (Mallareddy) మల్లారెడ్డికి ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇవాళే విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొనడంతో ఆయన తరఫునమల్లారెడ్డి మెడికల్ కాలేజీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సురేందర్ రెడ్డి హాజరయ్యారు. గత ఏడాది రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో పీజీ సీట్లు విక్రయించారంటూ ఆరోపణలు వచ్చాయి. ఈ అంశంపై పలువురు ఈడీకి ఫిర్యాదులు చేశారు. గత ఏడాది జూన్ లో 12 మెడికల్ కాలేజీల్లో ఈడీ సోదాలు చేపట్టింది.
ఇదే సందర్భంలో మల్లారెడ్డి నివాసంతోపాటు మెడికల్ కాలేజీ, కార్యాలయాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. పలు కీలక డాక్యుమెంట్లు, పెన్డ్రైవ్లు, హార్డ్డిస్క్లను సైతం ఈడీ స్వాధీనం చేసుకుంది. రాష్ట్రంలోని 10 ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లోని 45 సీట్లను బ్లాక్ చేసి విక్రయించినట్లు.. ఈడీ తన సోదాల్లో గుర్తించింది. దాంతో దీనిపై వివరణ ఇవ్వాలంటూ మాజీ మంత్రి సీహెచ్ (Mallareddy) మల్లారెడ్డితోపాటు వివిధ ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్ల ఆధారంగా ఇవాళ విచారణకు పిలవడం గమనార్హం.
పీజీ మెడికల్ కాలేజీ సీట్లు అక్రమంగా విక్రయించారనే అభియోగాలపై మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇవాళే విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొనడంతో ఆయన తరఫునమల్లారెడ్డి మెడికల్ కాలేజీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సురేందర్ రెడ్డి హాజరయ్యారు. గత ఏడాది రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో పీజీ సీట్లు విక్రయించారంటూ ఆరోపణలు వచ్చాయి. ఈ అంశంపై పలువురు ఈడీకి ఫిర్యాదులు చేశారు.
గత ఏడాది జూన్ లో 12 మెడికల్ కాలేజీల్లో ఈడీ సోదాలు చేపట్టింది. ఇదే సందర్భంలో మల్లారెడ్డి నివాసంతోపాటు మెడికల్ కాలేజీ, కార్యాలయాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. పలు కీలక డాక్యుమెంట్లు, పెన్డ్రైవ్లు, హార్డ్డిస్క్లను సైతం ఈడీ స్వాధీనం చేసుకుంది. రాష్ట్రంలోని 10 ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లోని 45 సీట్లను బ్లాక్ చేసి విక్రయించినట్లు.. ఈడీ తన సోదాల్లో గుర్తించింది. దాంతో దీనిపై వివరణ ఇవ్వాలంటూ మాజీ మంత్రి సీహెచ్ మల్లారెడ్డితోపాటు వివిధ ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు ఈడీ నోటీసులు జారీ చేసింది.
ఈ నేపథ్యంలో ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్ల ఆధారంగా ఇవాళ విచారణకు పిలవడం గమనార్హం.
Also read:

