Hydra: 200 ఎకరాలు స్వాధీనం చేసుకున్నం

Hydra

గత 5 నెలల్లో హైడ్రా (Hydra) దాదాపు 200 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేస్తున్నట్లుగా కమిషనర్​ రంగనాథ్​ తెలిపారు. త్వరలోనే హైడ్రా పోలీసు స్టేషన్​ను అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ఇవాళ మీడియాతో ఆయన మాట్లాడారు. . హైడ్రా (Hydra) ఏర్పడక ముందు అనుమతిచ్చిన ఏ కట్టడాలనూ హైడ్రా కూల్చదని స్పష్టం చేశారు. ‘ఎఫ్‌టీఎల్‌లో అనుమతులు లేకుండా కట్టిన వాణిజ్య, వ్యాపార కట్టడాలను మాత్రం కూల్చక తప్పదు. గతంలో అనుమతులు ఇచ్చి తరువాత రద్దు చేస్తే అవి అక్రమ కట్టడాలే అవుతాయి. అనుమతులు రద్దైనా నిర్మాణాలు జరుగుతుంటే అక్రమ కట్టడాలుగానే పరిగణిస్తాం.

Image

పేదలను ముందు పెట్టి వెనుక నుంచి చక్రం తిప్పుతున్న ల్యాండ్‌ గ్రాబర్స్‌ చర్యలను హైడ్రా తీవ్రంగా పరిగణిస్తుంది. మల్లంపేట కొత్వాల్‌ చెరువు, అమీన్‌పూర్‌లో కూల్చివేసినవి అక్రమ కట్టడాలే. ఎఫ్‌టీఎల్‌ మార్కింగ్‌ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తున్నాం. ప్రజలు ఇచ్చే ఫిర్యాదులకు హైడ్రా ప్రాధాన్యత వహిస్తూ 12 చెరువుల్లో కూల్చివేతలు చేపట్టాం.. చెరువుల పునరుద్ధరణకు ప్రభుత్వానికి నివేదించాం. ప్రభుత్వం అనుమతి ఇచ్చిన వెంటనే పనులు మొదలు పెడతాం. లోటుపాట్లు ఏమైనా ఉంటే వాటిని సవరించుకొని మరింత నిబద్ధతతో హైడ్రా పనిచేస్తోంది. వివిధ సందర్భాలలో కోర్టులు ఇచ్చిన తీర్పులకు లోబడి హైడ్రా ముందుకు వెళ్తోంది. హైడ్రాను బలోపేతం చేయడానికి ప్రభుత్వం పలు అధికారాలను కట్టబెట్టింది. సాంకేతికంగా కూడా మరింత బలంగా తయారవుతుంది.’ అని కమిషనర్‌ రంగనాథ్‌ అన్నారు.

Image

గత 5 నెలల్లో హైడ్రా దాదాపు 200 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేస్తున్నట్లుగా కమిషనర్​రంగనాథ్​తెలిపారు. త్వరలోనే హైడ్రా పోలీసు స్టేషన్​ను అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ఇవాళ మీడియాతో ఆయన మాట్లాడారు. . హైడ్రా ఏర్పడక ముందు అనుమతిచ్చిన ఏ కట్టడాలనూ హైడ్రా కూల్చదని స్పష్టం చేశారు. ‘ఎఫ్‌టీఎల్‌లో అనుమతులు లేకుండా కట్టిన వాణిజ్య, వ్యాపార కట్టడాలను మాత్రం కూల్చక తప్పదు. గతంలో అనుమతులు ఇచ్చి తరువాత రద్దు చేస్తే అవి అక్రమ కట్టడాలే అవుతాయి. అనుమతులు రద్దైనా నిర్మాణాలు జరుగుతుంటే అక్రమ కట్టడాలుగానే పరిగణిస్తాం.

Image

పేదలను ముందు పెట్టి వెనుక నుంచి చక్రం తిప్పుతున్న ల్యాండ్‌ గ్రాబర్స్‌ చర్యలను హైడ్రా తీవ్రంగా పరిగణిస్తుంది. మల్లంపేట కొత్వాల్‌ చెరువు, అమీన్‌పూర్‌లో కూల్చివేసినవి అక్రమ కట్టడాలే. ఎఫ్‌టీఎల్‌ మార్కింగ్‌ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తున్నాం. ప్రజలు ఇచ్చే ఫిర్యాదులకు హైడ్రా ప్రాధాన్యత వహిస్తూ 12 చెరువుల్లో కూల్చివేతలు చేపట్టాం.. చెరువుల పునరుద్ధరణకు ప్రభుత్వానికి నివేదించాం. ప్రభుత్వం అనుమతి ఇచ్చిన వెంటనే పనులు మొదలు పెడతాం. లోటుపాట్లు ఏమైనా ఉంటే వాటిని సవరించుకొని మరింత నిబద్ధతతో హైడ్రా పనిచేస్తోంది. వివిధ సందర్భాలలో కోర్టులు ఇచ్చిన తీర్పులకు లోబడి హైడ్రా ముందుకు వెళ్తోంది. హైడ్రాను బలోపేతం చేయడానికి ప్రభుత్వం పలు అధికారాలను కట్టబెట్టింది. సాంకేతికంగా కూడా మరింత బలంగా తయారవుతుంది.’ అని కమిషనర్‌ రంగనాథ్‌ అన్నారు.

Also read: