Kishan Reddy : కేసీఆర్ ఫ్యామిలీ చేతిలో రాష్ట్రం బందీ : కిషన్ రెడ్డి

Kishan Reddy

Kishan Reddy :  సీఎం కేసీఆర్​కుటుంబం చేతిలో తెలంగాణ బందీ అయిందని, వారి చెర నుంచి రాష్ట్రాన్ని విముక్తం చేసేందుకు ప్రజలు సన్నద్ధం కావాలని కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం సనత్​నగర్, జూబ్లీహిల్స్​ నియోజకవర్గాల్లోని సెజ్​కాలనీ, వెంగళ్ రావు నగర్​డివిజన్​లో నిర్వహించిన ‘‘ప్రజాగోస– బీజేపీ భరోసా” స్ట్రీట్​కార్నర్​ మీటింగ్స్ లో ఆయన మాట్లాడారు.

రాష్ట్రంలోని వనరులను బీఆర్ఎస్ ​నేతలు దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్​అక్రమంగా సంపాదించిన సొమ్ముతో విమానాలు కొంటున్నారన్నారు. ఆయన మళ్లీ అధికారంలోకి వస్తే అంతా దోచుకుంటారన్నారు. బీఆర్ఎస్ ​పేరుతో పలు రాష్ట్రాల నాయకులకు మన డబ్బులిస్తున్నారని విమర్శించారు.

దోపిడీ సొమ్ముతో కొడుకు, బిడ్డ, అల్లుడు, మనవడికి ఒక్కో ఫాం హౌస్​ఇచ్చారని, రాష్ట్ర ప్రజలకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వలేదన్నారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్​మెంట్​లాంటి పథకాలను నిర్వీర్యం చేశారన్నారు.