మెగాస్టార్ చిరంజీవికి తమ్ముడిగా పుట్టినందుకు తాను ఎప్పటికీ గర్విస్తానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అన్నారు. చిరంజీవి యూకే పార్లమెంట్ జీవిత సాఫల్య పురస్కారం అందుకున్న సందర్భంగా ఆయన ఈ మేరకు ఎక్స్ లో పోస్టు చేశారు. నాలుగున్నర దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా ఆయన అనేక మంది అభిమానులను సొంతం చేసుకున్నారని (Pawan Kalyan) చెప్పారు.
సాధారణ మధ్య తరగతి కానిస్టేబుల్ కుటుంబంలో పుట్టి స్వశక్తితో ఎదిగిన వ్యక్తిగా పేర్కొన్నారు. చారిబటుల్ ట్రస్టు ద్వారా రక్తదానం, నేత్రదానం అందిస్తూ అనేక మందికి స్పూర్తిగా నిలిచారన్నారు. తన సోదరుడు చిరంజీవి హృదయపూర్వక అభినందనలు తెలిపిన పవన్, భవిష్యత్తులో ఆయన మరిన్ని పురస్కారాలు అందుకోవాలని ఆకాంక్షించారు.

బ్రిటన్ పార్లమెంటులో తనకు జరిగిన సత్కారంపై చిరంజీవి సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డు అందుకున్న అయన ఆనంద, వ్యక్తం చేశారు. తన ఆనందం గురించి చెప్పేందుకు మాటలు సరిపోన్నారు. తన ఈ ప్రయాణంలో భాగమైన కుటుంబ సభ్యులు, అభిమానులు, స్నేహితులు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపారు. ‘‘యూకే పార్లమెంట్ సభ్యులు, మంత్రులు, ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో.. నన్ను సత్కరించినందుకు హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది.

‘బ్రిడ్జ్ ఇండియా’ సంస్థ జీవిత సాఫల్య పురస్కారం నేను అందుకోవడం సంతోషంగా ఉంది. ఈ గౌరవం నన్ను మరింత ఉత్సాహంగా ముందుకెళ్లేలా చేస్తుంది’ అని రాసుకొచ్చారు. సినీ రంగానికి, సమాజానికి చిరంజీవి చేస్తున్న సేవలను గుర్తించి ఆయనకు ‘బ్రిడ్జ్ ఇండియా’ సంస్థ జీవిత సాఫల్య పురస్కారం అందజేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు చిరంజీవికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
‘బ్రిడ్జ్ ఇండియా’ సంస్థ జీవిత సాఫల్య పురస్కారం నేను అందుకోవడం సంతోషంగా ఉంది. ఈ గౌరవం నన్ను మరింత ఉత్సాహంగా ముందుకెళ్లేలా చేస్తుంది’ అని రాసుకొచ్చారు. సినీ రంగానికి, సమాజానికి చిరంజీవి చేస్తున్న సేవలను గుర్తించి ఆయనకు ‘బ్రిడ్జ్ ఇండియా’ సంస్థ జీవిత సాఫల్య పురస్కారం అందజేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు చిరంజీవికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Also read:

