తెలుగు సినీ ఇండస్ట్రీ దేశంలోనే అత్యుత్తమమైనదని మలయాళ నటుడు మోహన్ లాల్ (Mohan Lal) కొనియాడారు. ‘ఎల్2: ఎంపురాన్’ సినిమా ఈనెల 27న విడుదల కాబోతున్న నేపథ్యంతో హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో (Mohan Lal) మాట్లాడారు. ‘నాకు తెలిసి టాలీవుడ్ దేశంలోనే బెస్ట్ ఇండస్ట్రీ. ఇక్కడి ఫ్యాన్స్ చూపించే ప్రేమను మాటల్లో చెప్పలేం. నటీనటులకు వారిచ్చే గౌరవం బాగుంటుంది. 47 ఏండ్ల నా కెరీర్లో ఎంతోమంది గొప్ప నటీనటుల్ని కలిసే అదృష్టం దక్కింది.
అక్కినేని నాగేశ్వరరావుగారితో కూడా నటించాను. మేం కేరళలో అన్ని భాషల సినిమాలూ చూస్తం. గతంలో నేను చేసిన మలయాళ సినిమాలు తెలుగులో రీమేక్ చేశారు. ఇప్పుడు డైరెక్ట్గా తెలుగులోనే విడుదల చేస్తున్నం. ఇది సీక్వెల్ కాదు.. మేం ఈ సినిమా కథ అనుకున్నప్పుడే మూడు భాగాలు తీయాలని నిర్ణయించుకున్నం. ‘ఎంపురాన్’ హిట్ కావాలని కోరుకుంటున్న’ అని పేర్కొన్నారు. కాగా.. మోహన్లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ తెరకెక్కించిన ‘ఎల్2: ఎంపురాన్’ ఈనెల 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.

తెలుగు సినీ ఇండస్ట్రీ దేశంలోనే అత్యుత్తమమైనదని మలయాళ నటుడు మోహన్ లాల్ కొనియాడారు. ‘ఎల్2: ఎంపురాన్’ సినిమా ఈనెల 27న విడుదల కాబోతున్న నేపథ్యంతో హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు. ‘నాకు తెలిసి టాలీవుడ్ దేశంలోనే బెస్ట్ ఇండస్ట్రీ. ఇక్కడి ఫ్యాన్స్ చూపించే ప్రేమను మాటల్లో చెప్పలేం. నటీనటులకు వారిచ్చే గౌరవం బాగుంటుంది. 47 ఏండ్ల నా కెరీర్లో ఎంతోమంది గొప్ప నటీనటుల్ని కలిసే అదృష్టం దక్కింది.
అక్కినేని నాగేశ్వరరావుగారితో కూడా నటించాను. మేం కేరళలో అన్ని భాషల సినిమాలూ చూస్తం. గతంలో నేను చేసిన మలయాళ సినిమాలు తెలుగులో రీమేక్ చేశారు. ఇప్పుడు డైరెక్ట్గా తెలుగులోనే విడుదల చేస్తున్నం. ఇది సీక్వెల్ కాదు.. మేం ఈ సినిమా కథ అనుకున్నప్పుడే మూడు భాగాలు తీయాలని నిర్ణయించుకున్నం. ‘ఎంపురాన్’ హిట్ కావాలని కోరుకుంటున్న’ అని పేర్కొన్నారు. కాగా.. మోహన్లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ తెరకెక్కించిన ‘ఎల్2: ఎంపురాన్’ ఈనెల 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.

Also read:

