‘యాభై ఏండ్ల కల సాకారమైంది. అయోధ్యలో (Ayodhya) భవ్య రామమందిరంలో శ్రీరాముడు కొలువు దీరాడు. ప్రభువు శ్రీరాముడి కృపతోనే ఈ యేడాది ప్రాణప్రతిష్టను చూడగలిగాం.. మర్యాద పురుషోత్తముడు శ్రీరాముడి జీవిత, ఆశయాలు, ఆదర్శాలు నవభారత నిర్మాణానికి ఆధారాలవుతాయి’ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని. ‘ ఈ సందర్భంగా నా హృదయం భావోద్వేగం, కృతజ్ఞతతో నిండిపోయింది. శ్రీరాముని కృప వల్లే నేను ఈ ఏడాది లక్షలాది మందితో కలిసి అయోధ్యలో (Ayodhya) ప్రాణప్రతిష్ఠను వీక్షించాను. ఆ క్షణాలు ఇప్పటికీ నా మదిలో శక్తిని నింపుతున్నాయి. అయోధ్య దివ్య మందిరంలో మన రామ్లల్లా కొలువుదీరిన తర్వాత జరుగుతున్న తొలి రామనవమి ఇది. ఐదు శతాబ్దాల నిరీక్షణ తర్వాత అక్కడ ఈ ఉత్సవాన్ని నిర్వహించుకునే భాగ్యం లభించింది. ఇది దేశ ప్రజల ఎన్నో సంవత్సరాల కఠిన తపస్సు, త్యాగాల ఫలితం’అని పేర్కొన్నారు. ఆలయ నిర్మాణం కోసం తమ జీవితాన్ని అంకితం చేసిన అసంఖ్యాక రామభక్తులు, సాధువులు, మహాత్ములను ఈ సందర్భంగా స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. శ్రీరాముని పాదాలకు ప్రణామాలు’అని మోదీ ఎక్స్లో పోస్ట్ చేశారు.
‘యాభై ఏండ్ల కల సాకారమైంది. అయోధ్యలో (Ayodhya) భవ్య రామమందిరంలో శ్రీరాముడు కొలువు దీరాడు. ప్రభువు శ్రీరాముడి కృపతోనే ఈ యేడాది ప్రాణప్రతిష్టను చూడగలిగాం.. మర్యాద పురుషోత్తముడు శ్రీరాముడి జీవిత, ఆశయాలు, ఆదర్శాలు నవభారత నిర్మాణానికి ఆధారాలవుతాయి’ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని. ‘ ఈ సందర్భంగా నా హృదయం భావోద్వేగం, కృతజ్ఞతతో నిండిపోయింది. శ్రీరాముని కృప వల్లే నేను ఈ ఏడాది లక్షలాది మందితో కలిసి అయోధ్యలో (Ayodhya) ప్రాణప్రతిష్ఠను వీక్షించాను. ఆ క్షణాలు ఇప్పటికీ నా మదిలో శక్తిని నింపుతున్నాయి. అయోధ్య దివ్య మందిరంలో మన రామ్లల్లా కొలువుదీరిన తర్వాత జరుగుతున్న తొలి రామనవమి ఇది. ఐదు శతాబ్దాల నిరీక్షణ తర్వాత అక్కడ ఈ ఉత్సవాన్ని నిర్వహించుకునే భాగ్యం లభించింది. ఇది దేశ ప్రజల ఎన్నో సంవత్సరాల కఠిన తపస్సు, త్యాగాల ఫలితం’అని పేర్కొన్నారు. ఆలయ నిర్మాణం కోసం తమ జీవితాన్ని అంకితం చేసిన అసంఖ్యాక రామభక్తులు, సాధువులు, మహాత్ములను ఈ సందర్భంగా స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. శ్రీరాముని పాదాలకు ప్రణామాలు’అని మోదీ ఎక్స్లో పోస్ట్ చేశారు
Also read:

