అభివృద్ధి ప్రణాళికలు
మేడారం (Medaram) జంపన్న వాగును పర్యాటక శాఖతో కలిసి అభివృద్ధి చేయనున్నట్లు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క ప్రకటించారు. వాగు నుంచి గ్రామం వరకు డివైడర్తో కూడిన డబుల్ రోడ్డు నిర్మిస్తామని ఆమె (Medaram) చెప్పారు.
స్మృతి వనం ఏర్పాటు
29 ఎకరాల్లో ఆదివాసీ పూజారుల స్మృతి వనాన్ని ఏర్పాటు చేయాలని ప్రణాళిక సిద్ధమైందని వెల్లడించారు. మేడారం అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డి నిధులు మంజూరు చేసినందుకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
భక్తుల సౌకర్యం
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. మేడారం జాతర నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.150 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు.
జాతర తేదీలు
వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు మేడారం జాతర జరగనుందని మంత్రి గుర్తుచేశారు.
Also read:

