ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా ( Lezhneva) తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తమ కుమారుడు మార్క్ శంకర్ అగ్ని ప్రమాదానికి గురై స్వల్ప గాయాలతో బయటపడటంతో అన్నా లెజినోవా ( Lezhneva) శ్రీవారి దర్శనానికి వచ్చారు. ఇవాళ వేకువ జామున శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు వేదాశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు ఆమెకు శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఆ తర్వాత అన్నా లెజినోవా అఖిలాండం వద్దకు చేరుకుని కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. అంతకుముందు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద టీటీడీ అధికారులు ఆమెకు స్వాగతం పలికారు. ఆదివారం సాయంత్రమే ఆమె తిరుమలకు చేరుకున్నారు. స్థానిక గాయత్రీ నిలయంలో ఆమె రాత్రి బస చేశారు. క్షేత్ర సంప్రదాయాన్ని పాటిస్తూ.. తొలుత ఆమె శ్రీభూవరాహస్వామి ఆలయంలో పూజలు చేశారు. అనంతరం శ్రీపద్మావతి విచారణ కేంద్రం వద్ద ఉన్న కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించారు. అన్యమతస్థురాలు కావడంతో మొదట అతిథిగృహంలో తాను శ్రీ వేంకటేశ్వరుడిని విశ్వసిస్తున్నాననే డిక్లరేషన్పై సంతకం చేశారు.
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తమ కుమారుడు మార్క్ శంకర్ అగ్ని ప్రమాదానికి గురై స్వల్ప గాయాలతో బయటపడటంతో అన్నా లెజినోవా శ్రీవారి దర్శనానికి వచ్చారు. ఇవాళ వేకువ జామున శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు వేదాశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు ఆమెకు శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఆ తర్వాత అన్నా లెజినోవా అఖిలాండం వద్దకు చేరుకుని కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు.
మార్క్ శంకర్ పేరిట అన్నదానం
రూ. 17 లక్షలు అందించిన పవన్ కల్యాణ్, లెజినోవా దంపతులు
తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో కుమారుడు మార్క్ శంకర్ పేరు మీద ఇవాళ అన్నదానం చేస్తున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, అన్నా లెజినోవా దంపతులు. ఇందుకోసం మధ్యాహ్నం భోజనానికి రూ. 17 లక్షలు విరాళంగా అందజేశారు. ఇందు కోసం అన్న ప్రసాద కేంద్రంలోని డిస్ ప్లే బోర్డుపై టీటీడీ అధికారులు వివరాలను ప్రదర్శిస్తున్నారు.
Also read:

