China: అమెరికాపై 125% టారిఫ్స్ పెంచిన చైనా

China

అమెరికా, చైనా (China) మధ్య సుంకాల యుద్ధం కొనసాగుతోంది. ప్రపంచంలోని అన్ని దేశాలు మెట్టుదిగనా డ్రాగన్ కంట్రీ మాత్రం వెనుకడుగు వేయడం లేదు. నిన్నటి వరకు అమెరికా ఉత్పత్తులపై చైనా 84% సుంకాలు విధించింది. అమెరికా వెనక్కు తగ్గకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్ ఆ దేశంపై ఏకంగా 145% సుంకాలు విధిస్తున్నట్టు ప్రకటించారు. ఈ ప్రకటనపై చైనా (China)  అంతే ఘాటుగా స్పందించింది. 84% ఉన్న టారిఫ్స్ ను 125%కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీనిపై చైనా ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.

చైనా ప్రయోజనాలను అమెరికా అణిచివేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించడంతోపాటు తాము చివరి శ్వాస వరకు పోరాడతామని చైనా పేర్కొంది. సుంకం పెంపు అంశంపై చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ తొలిసారి స్పందించారు. ఈ వాణిజ్య యుద్ధంలో ఎవరూ గెలవరని ఘాటుగా సమాధానం ఇచ్చారు. ఎవరు ఎన్ని చేసినా తమ దేశం భయపడబోదని స్పష్టం చేశారు. బీజింగ్‌లో స్పానిష్ ప్రధాని పెడ్రో సాంచెజ్‌తో జిన్‌పింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రపంచానికి వ్యతిరేకంగా వెళితే అమెరికా ఒంటరిగా మిగులుతుందన్నారు. ట్రంప్‌ విధించిన 145 శాతం సుంకాలు బెదిరింపులతో కూడినవని అన్నారు. ఏకపక్షంగా అమెరికా నిర్ణయాలు తీసుకుందని చెప్పారు. ట్రంప్‌ పన్నులను ప్రతిఘటించడానికి యూరోపియన్‌ యూనియన్‌ తమతో కలిసి రావాలని కోరుతున్నానని జిన్ పింగ్ చెప్పారు. యూరప్‌ తమ అంతర్జాతీయ బాధ్యతలను నెరవేర్చాల్సి ఉందని, అందరం ఐకమత్యంగా అమెరికాపై పోరాటం చేద్దామని పేర్కొన్నారు.

Image

ప్రపంచానికి వ్యతిరేకంగా వెళితే అమెరికా ఒంటరిగా మిగులుతుందన్నారు. ట్రంప్‌ విధించిన 145 శాతం సుంకాలు బెదిరింపులతో కూడినవని అన్నారు. ఏకపక్షంగా అమెరికా నిర్ణయాలు తీసుకుందని చెప్పారు. ట్రంప్‌ పన్నులను ప్రతిఘటించడానికి యూరోపియన్‌ యూనియన్‌ తమతో కలిసి రావాలని కోరుతున్నానని జిన్ పింగ్ చెప్పారు. యూరప్‌ తమ అంతర్జాతీయ బాధ్యతలను నెరవేర్చాల్సి ఉందని, అందరం ఐకమత్యంగా అమెరికాపై పోరాటం చేద్దామని పేర్కొన్నారు.

Also read: