పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రంగా మారుతున్నాయి. ప్రతీకార చర్యల్లో భాగంగా Iran తాజాగా Azerbaijan లోని ఎయిర్పోర్టులను లక్ష్యంగా చేసుకుని (Iran Drone) డ్రోన్ దాడులు జరిపినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ ఘటనతో ప్రాంతీయ భద్రతపై మరింత ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.ఇరాన్, టర్కీ సరిహద్దులకు సమీపంగా ఉన్న Nakhchivan ప్రత్యేక ప్రాంతంలోని విమానాశ్రయంపై ఈ డ్రోన్ దాడి జరిగినట్లు సమాచారం. రెండు డ్రోన్లు విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకున్నాయి. అందులో ఒక (Iran Drone) డ్రోన్ నేరుగా విమానాశ్రయ టెర్మినల్ భవనాన్ని తాకగా, మరో డ్రోన్ సమీపంలోని Shakarabad గ్రామంలో ఉన్న పాఠశాల దగ్గర కూలిపోయింది.

ఈ ఘటనలో ఇద్దరు సాధారణ పౌరులు గాయపడినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. భద్రతా సిబ్బంది వెంటనే స్పందించి ప్రాంతాన్ని పూర్తిగా తనిఖీ చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ప్రస్తుతం అక్కడ భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు సమాచారం.నక్చివాన్ ప్రాంతం భౌగోళికంగా కీలక ప్రాధాన్యత కలిగి ఉంది. ఇది Iran, Turkey సరిహద్దులకు సమీపంలో ఉండటంతో వ్యూహాత్మకంగా ముఖ్యమైన ప్రాంతంగా భావిస్తారు. గత ఏడాది Armenia మరియు Azerbaijan మధ్య జరిగిన ఘర్షణలకు ముగింపు పలికేలా అమెరికా మధ్యవర్తిత్వంతో శాంతి ఒప్పందం కుదిరింది.ఆ ఒప్పందం ప్రకారం నక్చివాన్ ప్రాంతాన్ని ప్రత్యేక పరిపాలన ప్రాంతంగా గుర్తించారు. “ట్రంప్ రూట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ ప్రాస్పరిటీ” పేరిట దీనిని అభివృద్ధి చేసే హక్కులు అమెరికాకు ఇవ్వబడినట్లు సమాచారం.

ఇదిలా ఉండగా, ఈ ప్రాంతాన్ని అజర్బైజాన్ ప్రభుత్వం ఇజ్రాయెల్ గూఢచర్య కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నదని ఇరాన్ గత కొన్ని సంవత్సరాలుగా ఆరోపిస్తోంది. ముఖ్యంగా Israel కు చెందిన గూఢచారి వ్యవస్థలు అక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని ఇరాన్ అనుమానం వ్యక్తం చేస్తోంది.ఈ తాజా డ్రోన్ దాడితో ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్న పరిస్థితులు మరింత క్లిష్టంగా మారాయి. ఇప్పటివరకు ప్రధానంగా Persian Gulf ప్రాంతంలో కేంద్రీకృతమైన ఉద్రిక్తతలు ఇప్పుడు టర్కీ సరిహద్దులు, అజర్బైజాన్ వరకు విస్తరించినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.ప్రాంతీయ రాజకీయాలు, భద్రతా సమీకరణాలు వేగంగా మారుతున్న నేపథ్యంలో ఈ సంఘటన అంతర్జాతీయంగా కూడా చర్చనీయాంశమైంది. ఈ ఘర్షణలు మరింత విస్తరించే అవకాశంపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
Also read:

