భారత సాయుధ దళాలు జరిపిన దాడిలో తమ దేశంలోని 11 ఎయిర్బేస్లు దెబ్బతిన్నట్లు పాకిస్తాన్ ఉప ప్రధాని ఇషాక్ దార్ (IshaqDar) అంగీకరించారు. ఆపరేషన్ సిందూర్లో భాగంగా తమ ఎయిర్బేస్లపై ఇండియన్ మిసైల్స్ దాడి చేసినట్లు చెప్పారు. ఇదిలా ఉండగా భారత్తో జరిగిన సైనిక దాడిలో తమ విమానం ఒకటి స్వల్పంగా ధ్వంసం అయినట్లు పాక్ సైన్యం కూడా అంగీకరించింది. అయితే ధ్వంసమైన జెట్కు సంబంధించిన వివరాలు వెల్లడించలేదు. ఎయిర్ఫోర్స్, నేవీ అధికారులతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్న పాక్ ఆర్మీ అధికార (IshaqDar) ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి ఆపరేషన్ బన్యాన్–ఉమ్–మర్సూస్ ముగిస్తున్నట్లు చెప్పారు. భారత పైలెట్లు ఎవరూ తమ కస్టడీలో లేరని చెప్పారు.
భారీ నష్టం కలిగించిన భారత్
నిజానికి ఆపరేషన్ సిందూర్తో భారత సాయుధ దళాలు పాకిస్తాన్కు భారీ నష్టం కలిగించాయి. కొన్ని ఫైటర్ జెట్లను కూల్చేశాయి. రాజధాని ఇస్లామాబాద్ సమీపంలోని కీలక మిలిటరీ స్థావరాలకు నష్టం చేశాయి. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్ సైన్యం ప్రతిరోజూ నియంత్రణ రేఖ వెంబడి కాల్పులు జరుపుతూ కవ్వింపు చర్యలు చేపట్టింది. మూడు రోజుల పాటు ఆ దేశ కీలక స్థావరాలపై భారత్ సాయుధ దళాలు విరుచుకుపడటంతో కాల్పుల విమరణకు అంగీకరించి కూడా కొన్ని గంటల్లోనే తిరిగి ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ఇరు దేశాల డీజీఎంవోల చర్చలకు ఒకరోజు ముందు ఎలాంటి కాల్పులకు దిగని పాక్… తాజాగా ఇవాళ తాము నష్టపోయిన విషయాన్ని అంగీకరించింది.
భారీ నష్టం కలిగించిన భారత్
నిజానికి ఆపరేషన్ సిందూర్తో భారత సాయుధ దళాలు పాకిస్తాన్కు భారీ నష్టం కలిగించాయి. కొన్ని ఫైటర్ జెట్లను కూల్చేశాయి. రాజధాని ఇస్లామాబాద్ సమీపంలోని కీలక మిలిటరీ స్థావరాలకు నష్టం చేశాయి. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్ సైన్యం ప్రతిరోజూ నియంత్రణ రేఖ వెంబడి కాల్పులు జరుపుతూ కవ్వింపు చర్యలు చేపట్టింది. మూడు రోజుల పాటు ఆ దేశ కీలక స్థావరాలపై భారత్ సాయుధ దళాలు విరుచుకుపడటంతో కాల్పుల విమరణకు అంగీకరించి కూడా కొన్ని గంటల్లోనే తిరిగి ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ఇరు దేశాల డీజీఎంవోల చర్చలకు ఒకరోజు ముందు ఎలాంటి కాల్పులకు దిగని పాక్… తాజాగా ఇవాళ తాము నష్టపోయిన విషయాన్ని అంగీకరించింది.
Also read:
- LIK: ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ రిలీజ్ డేట్ ఫిక్స్
- Revanth: లక్షా 75 వేల ఎకరాల తాకట్టుకు రేవంత్ స్కెచ్

