Israel: ఇరాన్​ మిలిటరీ ఎయిర్​బేస్​ల​పై ఇజ్రాయెల్ దాడి

Israel

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మళ్లీ ఎగిసిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ (Israel) మరోసారి ఇరాన్‌పై పెద్దస్థాయిలో దాడికి దిగింది. టెహ్రాన్, మషాద్, డెజ్‌ఫుల్ సహా ఆరు కీలక మిలిటరీ ఎయిర్ బేస్‌లపై విరుచుకుపడినట్లు (Israel) ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (IDF) ప్రకటించింది. ఈ దాడులు ఇరాన్‌ వైమానిక బలగాలకు పెద్ద ముప్పుగా మారినట్లు తెలుస్తోంది.

Image

15 ఎయిర్‌క్రాఫ్ట్‌లు, హెలికాప్టర్ల ధ్వంసం:
IDF విడుదల చేసిన ప్రకటన ప్రకారం, దాడుల్లో ఇరాన్‌కు చెందిన 15 ఫిక్స్‌డ్-వింగ్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు మరియు హెలికాప్టర్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఇందులో అమెరికా రూపొందించిన ఎఫ్–14, ఎఫ్–5 ఫైటర్ జెట్లు, AH–1 హెలికాప్టర్లు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఈ ఎయిర్ బేస్‌లలో ఉన్న అండర్‌గ్రౌండ్ బంకర్లు కూడా ధ్వంసమయ్యాయని IDF తెలిపింది.

కెర్మాన్‌షా ప్రాంతంలో క్షిపణుల నిల్వ కేంద్రంపై దాడి:
కెర్మాన్‌షా ప్రాంతంలో బాలిస్టిక్ క్షిపణుల నిల్వ కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకొని మరో దాడిని జరిపినట్టు IDF ప్రకటించింది. ఈ దాడిలో 15 ఫైటర్ జెట్లు పాల్గొన్నాయి. ఇది ఇజ్రాయెల్‌ నుంచి వచ్చిన ఓ సుదీర్ఘతమైన మిలిటరీ దాడిగా పరిగణించబడుతోంది.

Image

ఇరాన్ డ్రోన్ కౌంటర్:
ఇజ్రాయెల్ నుంచి వచ్చిన డ్రోన్లలో ఒకదాన్ని ఇరాన్ సైన్యం కూల్చివేసినట్టు కూడా ఇజ్రాయెల్ అధికారికంగా ధృవీకరించింది. అయితే మిగిలిన డ్రోన్లు తమ లక్ష్యాలను విజయవంతంగా పూర్తిచేశాయని పేర్కొంది.

మృతులు, తీవ్ర నష్టం:
ఈ దాడుల్లో ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC)కి చెందిన 10 మంది సిబ్బంది మృతి చెందినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. మిగిలిన వారిపై ఇంకా సమాచారం అందాల్సి ఉంది. ఈ దాడులు మిలిటరీ మౌలిక వసతులపై తీవ్ర ప్రభావాన్ని చూపించినట్టు వాణిజ్య ఉపగ్రహ చిత్రాల ద్వారా కూడా వెల్లడైంది.

Image

ప్రాంతీయ స్థాయిలో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి:
ఈ ఘటనల నేపథ్యంలో మధ్యప్రాచ్యంలో మళ్లీ సంక్షోభ భయం రేకెత్తుతోంది. ఇప్పటికే ఉన్న ఇజ్రాయెల్–ఇరాన్ రాజకీయ, మిలిటరీ విభేదాల మధ్య ఈ దాడులు మంటలు మరింత రాజేశాయి. యుద్ధ భయాలు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Also read: