అమెరికా అధ్యక్షుడు ప్రకటించిన తాజా టారిఫ్ (Tariff) విధానాలు ప్రపంచ దేశాల్లో సంచలనంగా మారాయి. 70 దేశాలపై ఆర్థికంగా ప్రభావం చూపేలా అమెరికా ప్రభుత్వం వివిధ శాతాల్లో సుంకాలు (Tariff) విధించింది. అయితే, ఈ జాబితాలో భారతదేశంపై విధించిన 25% సుంకం ప్రత్యేకంగా చర్చకు వస్తోంది. మన పొరుగునే ఉన్న పాకిస్తాన్కు కేవలం 19% టారిఫ్ విధించడం గమనార్హం.
ఈ టారిఫ్ల ప్రకారం, అత్యధికంగా సిరియాపై 41% సుంకాలు విధించనున్నట్టు వెల్లడించారు. లావోస్, మయన్మార్ దేశాలపై 40%, స్విట్జర్లాండ్పై 39% టారిఫ్లు విధించగా, ఇరాక్, సెర్బియా దేశాలపై 35% టాక్స్ విధించారు. అలాగే అల్జీరియా, బోస్నియా, హెర్జెగోవినా, లిబియా, దక్షిణాఫ్రికా వంటి దేశాలపై 30% సుంకాలు విధించారు.
భారతదేశానికి చెందిన షరతులు ఇంకా కఠినంగా ఉన్నాయని చెప్పొచ్చు. భారత్తో పాటు బ్రూనై, కజాఖస్తాన్, మోల్డోవా, ట్యునీషియా దేశాలపై 25% టారిఫ్ విధించడం ద్వారా, అమెరికా ప్రభుత్వం ఈ దేశాలతో ఉన్న వాణిజ్య సంబంధాలపై మోచేతి తూటాలు పేల్చినట్లే.
ఇక బంగ్లాదేశ్, శ్రీలంక, తైవాన్, వియత్నాం వంటి దేశాలపై 20% టారిఫ్లు విధించారు. ఇదే సమయంలో పాకిస్తాన్, మలేషియా, ఇండోనేషియా, కంబోడియా, ఫిలిప్పీన్స్, థాయిలాండ్ వంటి దేశాలపై కేవలం 19% సుంకాలు విధించారు. ఇది అమెరికా అధ్యక్షుడు పాకిస్తాన్పై చూపుతున్న అనుకూల ధోరణిని సూచిస్తుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇజ్రాయెల్, జపాన్, టర్కీ, నైజీరియా, ఘనా వంటి దేశాలపై 15% టారిఫ్లు ఉండగా, బ్రెజిల్, బ్రిటన్ (యూకే), ఫాక్లాండ్ దీవులపై కేవలం 10% టాక్స్ విధించడం గమనార్హం.
అత్యంత దృఢమైన చర్యగా అమెరికా తీసుకున్న అంశం కెనడాపై కనిపిస్తుంది. “అక్రమ మాదకద్రవ్య సంక్షోభం”పై చర్యలు తీసుకోవడంలో విఫలమైందని పేర్కొంటూ, కెనడాపై టారిఫ్ను 25% నుంచి 35%కు పెంచినట్టు వైట్ హౌస్ పేర్కొంది.
ఈ నిర్ణయాలు అంతర్జాతీయ వాణిజ్య రంగంలో అనేక రాజకీయ, ఆర్థిక ప్రభావాలను కలిగించే అవకాశమున్నాయి. భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలపై భారీ టారిఫ్లు విధించడం భారతీయ వ్యాపార రంగానికి మేలు కాకపోవచ్చని విశ్లేషకులు అంటున్నారు.

