టీసీఎస్లో 12 వేల ఉద్యోగాల కోత – ఏఐ ప్రభావం కాదంటున్న సీఈవో
దేశంలో అగ్రగామి ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS)
తమ వర్క్ఫోర్స్లో సుమారు 2% వరకు ఉద్యోగులను తగ్గించనున్నట్లు ప్రకటించింది.
ఇది సంఖ్యాపరంగా చూస్తే దాదాపు 12 వేల మందికి పైగా ఉద్యోగాల కోతకు దారితీస్తుంది.
- అయితే ఈ ఉద్యోగ కోతకు ఏఐ కారణం కాదు అని సంస్థ సీఈవో కే. కృతివాసన్ స్పష్టంగా తెలిపారు.
- సంస్థలో బేసిక్ డిజిటల్ స్కిల్స్పై 5.5 లక్షల మంది ఉద్యోగులకు శిక్షణ,
- అడ్వాన్స్డ్ టెక్నాలజీస్లో లక్ష మందికి పైగా ట్రైనింగ్ ఇచ్చినట్టు వివరించారు.
కానీ కొన్ని స్థాయిల్లో సీనియర్ ప్రొఫెషనల్స్ ఇనీషియల్ ట్రైనింగ్ దాటకపోవడం,
అదే సమయంలో సంస్థకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం లోపించడం వల్ల ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు.TCS
ఇదే తరహాలో
- మైక్రోసాఫ్ట్ – 15,000 ఉద్యోగాల కోత
- ఇంటెల్ – 24,000 మంది తొలగింపు ప్లాన్
- మెటా – 5% వర్క్ఫోర్స్ కోత
- పానసోనిక్ – 10,000 ఉద్యోగాల తగ్గింపు
ఈ ప్రకటనలన్నీ గ్లోబల్ టెక్ రంగంలో జరుగుతున్న మార్పులను సూచిస్తున్నాయి.
ఏఐ ఆధారిత మౌలిక సదుపాయాల కోసం సంస్థలు భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి.
Also Read :