RangaReddy : గన్ తో కాల్చుకొని కానిస్టేబుల్ సూసైడ్

రంగారెడ్డి (RangaReddy) కలెక్టరేట్​లో ఘటన
ఏఆర్​కానిస్టేబుల్​తన గన్​తో కాల్చుకొని సూసైడ్​ చేసుకున్న ఘటన రంగారెడ్డి(RangaReddy) జిల్లా కలెక్టరేట్​లో సంచలనంగా మారింది. తెల్లవారు జామున 3 గంటల టైంలో బూత్​రూమ్​లోకి వెళ్లి ఏఆర్​ కానిస్టేబుల్​గా కలెక్టరేట్​ ఆఫీస్​ గ్రౌండ్​ఫోర్​లో డ్యూటీ చేస్తున్న బాలకృష్ణ (27) తనవద్ద ఉన్న తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సూసైడ్​నోట్​రాసి ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది.

సూసైడ్​ చేసుకున్న టైంలో మృతుడితో పాటు ముగ్గరు కానిస్టేబుల్స్​డ్యూటీ చేస్తున్నట్లుగా సమాచారం. మృతుడి స్వగ్రామం రంగారెడ్డి(RangaReddy) జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని మంచాల మండలం కాగా, 2018 బ్యాచ్ కు చెందిన కానిస్టేబుల్ గా పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని డెడ్​బాడీని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి, విచారిస్తున్నారు. సూసైడ్​కు కారణాలు తెలియాల్సి ఉంది.

 

Also read :

Ranganath: ఏ ఒక్కరికీ అన్యాయం జరగనివ్వం

Johnny Master: నా భర్తను ట్రాప్ చేసింది