తాను చేసిన ఆరోపణలన్నీ నిజమేనని హనుమకొండ జిల్లా ధర్మాసాగర్ మండలం జానకీపురం సర్పంచ్ నవ్య అన్నారు. తనపై ఆరోపణలు చేసిన జానకీపురం గ్రామ సర్పంచ్ నవ్యతో రాజయ్య (RAJAIAH) అయ్యారు. నేరుగా ఆమె ఇంటికి వెళ్లి రాజయ్య (RAJAIAH) మాట్లాడారు. అధిష్టానం నిర్ణయం మేరకు భర్త ప్రవీణ్ అహ్వానం మేరకు తాను ఇక్కడికి వచ్చానని ఎమ్మెల్యే రాజయ్య తెలిపారు. నాలుగు రోజుల క్రితం ఎమ్మెల్యే రాజయ్య తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ నవ్య ఆరోపించారు.
ఎమ్మెల్యే రాజయ్యే వల్లే
సర్పంచ్ అయ్యా : నవ్య
ఎమ్మెల్యే రాజయ్యే వల్లే తాను సర్పంచ్ అయ్యానని జానకీపురం సర్పంచ్ నవ్య అన్నారు. తమ గ్రామాన్ని ఎమ్మెల్యే దత్తత తీసుకున్నారని, కానీ ఆయన వల్ల గ్రామంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. తన గ్రామానికి ఎలాంటి అభివృద్ధి చేస్తారో ఎమ్మెల్యే రాజయ్య మీడియా ముఖంగా చెప్పాలని కోరారు. మహిళలకు అడుగడుగునా అన్యాయం జరుగుతుందని నవ్య అన్నారు. తప్పు చేసిన వారిని క్షమిస్తానని చెప్పారు. అయితే ఆమె రాజయ్య వేధింపులపై మాత్రం నేరుగా స్పందించలేదు. కానీ రాజయ్య పక్కన ఉండగానే ఆయనపై నవ్య తీవ్ర ఆరోపణలు చేశారు. తాను చేసిన ప్రతి ఆరోపణ నిజం అని నవ్య తెలిపింది.
తెలిసో తెలియకో తప్పు చేశా..క్షమించండి
స్టేషన్ ఘనపుర్ నియోజకవర్గం తన వల్ల మహిళల ఆత్మగౌరవానికి కేంద్రంగా ఉందని ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. ఇప్పటి వరకు జరిగిన పరిణామాలకు తాను చింతిస్తున్నానని చెప్పారు. తెలిసో తెలియకో తప్పులు చేసి ఉంటే మహిళా లోకాన్ని క్షమాపణలు కోరుతున్నానని ఎమ్మెల్యే రాజయ్య అన్నారు. మహిళల అభివృద్ధి, వారి ఆత్మ గౌరవం కోసం ఎన్నో కార్యక్రమాలను చేపట్టామన్నారు. తనకు నలుగురు చెల్లెల్లు ఉన్నారని..తన ఒంట్లో ఊపిరి ఉన్నంత వరకు మహిళల ఆత్మగౌరవం కోసం కృషి చేస్తానని స్పష్టం చేశారు.
జానకీపురం అభివృద్ధికి సహకరిస్తా
జానకీపురం గ్రామాభిృద్ధికి సహకరిస్తానని ఎమ్మెల్యే రాజయ్య తెలిపారు. గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు ఎమ్మెల్యే నిధుల నుంచి రూ. 25 లక్షలు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. అభివృద్థి అనేది నిరంతర ప్రక్రియ అని..జానకిపురం గ్రామ సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని సర్పంచ్ నవ్యకు సూచించారు. జానకీపురం గ్రామాభివృద్ధికి సర్పంచ్ నవ్య ప్రవీణ్తో కలిసి పనిచేస్తామన్నారు. గతంలో సర్పంచ్ టికెట్ ఇచ్చే సమయంలో తాను ప్రవీణ్ ను మాత్రమే చూశానని..నవ్యను ఎప్పుడు చూడలేదన్నారు.
ALSO READ :

