అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ఓ ఒపీనియన్ పోల్ బయటికి వచ్చింది. కీలక రాష్ట్రాల్లో డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ కంటే రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్నకే మద్దతు ఎక్కువగా ఉంది. ఏడు రాష్ట్రాల్లో సర్వే చేయగా ఆరు రాష్ట్రాల్లో ట్రంప్నకు ఆధిక్యం లభించింది. జో బైడెన్ పనితీరుపై అసంతృప్తితో ఉన్నట్టు పౌరులు తెలిపారు.
దేశ ఆర్థిక వ్యవస్థ, ఉపాధి కల్పన వంటి సమస్యల పరిష్కారంలో ఆయన సామర్థ్యంపై సందేహం వ్యక్తం చేసినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ నిర్వహించిన ఒపీనియన్ పోల్ తేల్చింది. ఆరు రాష్ట్రాల్లో ట్రంప్నకు(Trump) ఆరు నుంచి ఎనిమిది పర్సంటేజీ పాయింట్ల ఆధిక్యం లభించినట్లు తెలిపింది. పెన్సిల్వేనియా, మిషిగన్, అరిజోనా, జార్జియా, నెవడా, ఉత్తర కరోలినా, విస్కాన్సిన్ రాష్ట్రాల్లో సర్వే నిర్వహించారు. ఎన్నికల ఫలితాలను ఈ రాష్ట్రాలే అత్యధికంగా ప్రభావితం చేస్తాయనే అంచనాలున్నాయి.
ఒక్క విస్కాన్సిన్లో మాత్రమే ట్రంప్ కంటే బైడెన్ మూడు పాయింట్లతో ముందంజలో ఉన్నారు. సర్వే జరిపిన అన్ని రాష్ట్రాల్లో బైడెన్ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేసినవారి కంటే అసంతృప్తిగా ఉన్నవారే అధికంగా ఉన్నారు. ట్రంప్ (Trump)పనితీరే బాగుండేదనే అభిప్రాయాన్ని మెజార్టీ ఓటర్లు వ్యక్తం చేశారు. ఒక్క అరిజోనాలో మాత్రమే ఆయనకు నెగెటివ్ మార్కులు వచ్చాయి.
Also read :
Shiva Balakrishna : హెచ్ఎండీఏ శివబాలకృష్ణకు బెయిల్
Kavitha : కవిత బెయిల్ పై తీర్పు రిజర్వ్

