Sudha Ramakrishnan: మహిళా ఎంపీ మెడలోంచి గొలుసు చోరీ

గొలుసు దొంగలు రెచ్చిపోయారు. మార్నింగ్​ వాక్​ చేస్తున్న మహిళా ఎంపీ(Sudha Ramakrishnan) మెడలోని చైన్​ లాక్కెళ్లారు. ఈ ఘటన అత్యంత భద్రత ఉండే దేశ రాజధాని నగరం ఢిల్లీలో చోటు చేసుకుంది. తమిళనాడుకు చెందిన కాంగ్రెస్​ పార్టీ ఎంపీ సుధా రామకృష్ణన్​ ఇవాళ ఉదయం మార్నింగ్​ వాక్​ చేస్తున్నారు. ఆ సమయంలో గుర్తు తెలియని దుండగులు ఆమె మెడలోని గొలుసును లాక్కెళ్లారు. మహిళా ఎంపీ(Sudha Ramakrishnan) ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్​ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: