రాష్ట్రంలో ఇంజినీరింగ్ కౌన్సెలింగ్(EC) షెడ్యూల్ విడుదలైంది. జూన్ 27 నుంచి ఆగస్టు 5 వరకు మూడు విడతల్లో ప్రవేశాల ప్రక్రియ చేపట్టనున్నారు. వచ్చేనెల 30 నుంచి మొదటి విడత వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చని ఉన్నత విద్యాశాఖ పేర్కొంది. జులై 12న సీట్లు కేటాయిస్తారు. జులై 19 నుంచి సెకండ్ఫేజ్కౌన్సెలింగ్(EC) ప్రారంభం కానుండగా.. 24న సీట్ల కేటాయింపు ఉంటుంది. జులై 30 నుంచి తుది విడత కౌన్సెలింగ్జరగనుంది. ఆగస్టు 5న ఫైనల్ఫేజ్ ఇంజినీరింగ్ సీట్లు కేటాయిస్తారు. అలాగే ఇంటర్నల్ స్లైడింగ్ ఆన్లైన్లో కన్వీనర్ ద్వారా చేపట్టాలని నిర్ణయించారు. ఆగస్టు 12 నుంచి ఇంటర్నల్ స్లైడింగ్ ప్రక్రియ, 16 సీట్ల కేటాయింపు. ఆగస్టు 17న స్పాట్ అడ్మిషన్లకు మార్గదర్శకాలు విడుదల చేశారు.
ALSO READ :

