Rajesh Banik: క్రికెటర్ రాజేష్ బానిక్ మృతి

భారత మాజీ అండర్–19 క్రికెటర్ (Rajesh Banik) రాజేష్ బానిక్ (40) దురదృష్టకర రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. పశ్చిమ త్రిపుర జిల్లాలోని ఆనందనగర్ ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదం క్రికెట్ వర్గాలను తీవ్ర విషాదంలో ముంచేసింది. సమాచారం ప్రకారం, (Rajesh Banik) రాజేష్ బానిక్ ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనం నియంత్రణ కోల్పోవడంతో ఒక లారీని ఢీకొట్టింది. ఘటన స్థలంలోనే ఆయన మరణించినట్లు పోలీసులు తెలిపారు.

A man with short black hair and smiling expression stands on a grassy field with a dirt track, wearing a blue collared sports jersey with white accents and a logo on the chest, arms crossed, posed confidently. Background includes green trees, a building, and other people in the distance under a clear sky.

రాజేష్ బానిక్ 2002–03 సీజన్‌లో త్రిపుర తరఫున రంజీ ట్రోఫీ ద్వారా తన ఫస్ట్‌క్లాస్ క్రికెట్ కెరీర్‌ను ప్రారంభించారు. ఆల్‌రౌండర్‌గా రైట్ ఆర్మ్ మీడియం పేసర్, బ్యాట్స్‌మన్‌గా త్రిపుర తరఫున ప్రదర్శన కనబరిచారు. దేశంలో క్రికెట్‌ అభివృద్ధి చెందని రాష్ట్రం నుంచి వచ్చినప్పటికీ తన ప్రతిభతో అండర్–19 ప్రపంచకప్ జట్టుకు ఎంపిక కావడం ఆయన కెరీర్‌లో గర్వకారణంగా నిలిచింది.

Collage of four photos featuring a young man with short black hair and smiling expression. Top left shows him standing on a grassy field wearing a light blue collared sports jersey with arms crossed. Top right depicts him leaning on a railing in a black t-shirt and dark pants near an urban building. Bottom left captures him posing with arms crossed in a light blue t-shirt under an umbrella beside potted plants. Bottom right illustrates him smiling next to a black car wearing a blue jersey with Tripura emblem.

క్రికెట్‌ నుంచి రిటైర్‌ అయిన తర్వాత కూడా ఆయన క్రీడతో సంబంధాలు కొనసాగించారు. త్రిపుర క్రికెట్‌ అసోసియేషన్‌లో అండర్–16 జట్టుకు సెలెక్టర్గా పని చేశారు. యువ ఆటగాళ్లను ప్రోత్సహించడంలో, మార్గనిర్దేశం చేయడంలో ఆయన ముఖ్యపాత్ర పోషించారు.

రాజేష్‌ బానిక్‌ మరణ వార్త త్రిపుర క్రికెట్‌ వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. త్రిపుర క్రికెట్‌ అసోసియేషన్‌ (TCA) అధ్యక్షుడు ఒక ప్రకటనలో,
“రాజేష్ బానిక్‌ మరణం త్రిపుర క్రికెట్‌కు అపార నష్టం. ఆయన సేవలు చిరస్థాయిగా గుర్తుండిపోతాయి. కుటుంబ సభ్యులకు మనఃపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాం” అని అన్నారు.

స్థానిక పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదం సమయంలో బానిక్ ఒక్కడే బైక్‌పై ప్రయాణిస్తున్నట్లు తెలిసింది. ఆయన మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం అగర్తల మెడికల్ కాలేజీకి తరలించారు.

రాజేష్‌ బానిక్‌ కుటుంబం, స్నేహితులు, అభిమానులు తీవ్రంగా విచారాన్ని వ్యక్తం చేస్తున్నారు. క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో ఆయనకు నివాళులు అర్పిస్తూ, “త్రిపుర క్రికెట్‌ చరిత్రలో ఒక నిబద్ధత కల ఆటగాడిని కోల్పోయాం” అని వ్యాఖ్యానిస్తున్నారు.

Also read: