₹49,000 కోట్ల మోసం చేసిన గుర్నామ్ సింగ్ అరెస్ట్: దేశంలోనే అతిపెద్ద పెట్టుబడి స్కాం
దేశవ్యాప్తంగా దాదాపు 5 కోట్ల మంది ప్రజలను మోసం చేసిన పెరల్స్ ఆగ్రో టెక్ కార్పొరేషన్ లిమిటెడ్ (PACL) డైరెక్టర్ గుర్నామ్ సింగ్ (Gurnam)ను ఉత్తరప్రదేశ్ ఆర్థిక నేరాల విభాగం (EFOW) అధికారులు అరెస్టు చేశారు. ఇది భారత దేశంలో ఇప్పటివరకు నమోదైన అతిపెద్ద పెట్టుబడి మోసాల్లో ఒకటిగా గుర్తించబడుతోంది.
49 వేల కోట్లకు పైగా మోసం
గుర్నామ్ సింగ్ ఆధ్వర్యంలోని సంస్థ 1996లో గురువంత్ ఆగ్రో టెక్ లిమిటెడ్గా ప్రారంభమైంది. 2011లో పేరు మారి పీఏసీఎల్ లిమిటెడ్ (PACL) అయింది. ఈ సంస్థ, ఆర్బీఐ ఎన్బీఎఫ్సీగా (NBFC) అనుమతించనప్పటికీ, దేశంలోని పది రాష్ట్రాల్లో నిబంధనలకు విరుద్ధంగా రూ. 49,000 కోట్లకు పైగా ప్రజల నుంచి నిధులు సేకరించింది.(Gurnam)
మోసానికి గురైన రాష్ట్రాలు
యూపీ, పంజాబ్, ఢిల్లీ, అస్సాం, రాజస్థాన్, బీహార్, మధ్యప్రదేశ్, కేరళ, చత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ స్కాం విస్తరించింది. ఊహించదగిన పెట్టుబడిపై అధిక లాభాలు, భూముల హామీ ఇచ్చి లక్షలాది మంది ప్రజలను ఈ గ్యాంగ్ మోసం చేసింది.
పెట్టుబడి రసీదుల మాయ
వినియోగదారులకు రసీదులు జారీ చేసి భరోసా కల్పించిన PACL సంస్థ, గడువు తీరిన తర్వాత ధనం తిరిగి ఇవ్వకపోవడం, భూములు చూపించకపోవడం వంటి మోసపు చర్యలు చేపట్టింది. దీంతో సుమారు 50 లక్షల మంది బాధితులు ఉన్నట్టు ప్రాథమికంగా తేలింది.
సీబీఐ, ఈడీ దర్యాప్తులో గుర్నామ్
ఈ కేసును CBI మరియు EDలు ఇప్పటికే దర్యాప్తు చేస్తున్నాయి. ఇప్పటివరకు 10 మంది నిందితులపై కేసులు నమోదు కాగా, నలుగురు ఇప్పటికే జైలులో ఉన్నారు. తాజాగా అరెస్ట్ అయిన గుర్నామ్ సింగ్, ప్రధాన కుట్రదార
Also Read :

