ఎక్సైజ్ దాడులతో అక్రమార్కులు నయా రూట్ నుఎంచుకుంటున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా పసుపు ప్యాకెట్లలో గంజాయిని సప్లై చేస్తున్నారు. నమ్మదగిన సమాచారంతో రంగంలోకి దిగిన ఎక్సైజ్పోలీసులు ఇవాళ గంజాయి సప్లై చేస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు. సిటీలోని దూల్పేట్(Dhoolpet )కు చెందిన నేహా బాయ్ అనే మహిళను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీ తిరుపతి యాదవ్, ఎస్ఐ నాగరాజుతో పాటు సిబ్బంది రైయిడ్ చేసి పట్టుకున్నారు. వారి వద్ద నుంచి పసుపు ప్యాకెట్లతో 10 గంజాయి ప్యాకెట్లను సీజ్ చేశారు.

ఈ ఘటనను వెలుగులోకి తెచ్చిన ఎన్ఫోర్స్మెంట్ టీమ్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి అభినందించారు. అధికారులు ఇదే పనితీరును కనబరచి, డగ్స్, గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నారు.
Also read :
Ayesha Khan : ఆయేషా ఖాన్ స్టన్నింగ్ లుక్స్
Handloom workers: నేతన్న శుభవార్త
