HYD :రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్​

HYD : కాంగ్రెస్​ వారసత్వ, ఓటు బ్యాంక్​రాజకీయాలు చేస్తోందని ప్రధాని మోదీ అన్నారు. మెదక్​జిల్లా అల్లాదుర్గం నిర్వహించిన బీజేపీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ‘కాంగ్రెస్​ హయాంలో అవినీతిని దేశం చూసింది. పదేండ్లుగా ఎన్డీఏ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజలు చూశారు.​ మళ్లీ పాత రోజుల్ని తేవాలని కాంగ్రెస్ కుట్ర చేస్తోంది. గతంలో బీఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్​రాష్ట్రాన్ని దోచుకుంటున్నాయి. తెలంగాణలో అవినీతి అంతం కావాలంటే బీజేపీ రావాల్సిందే. టాలీవుడ్​ట్రిపుల్​ఆర్​సూపర్​హిట్​ సినిమా ఇచ్చింది. ఇప్పుడు డబుల్ ఆర్ ట్యాక్స్ పై చర్చ జరుగుతోంది. మీరు జీవితాంతం సంపాదించుకున్న ఆస్తులపై కాంగ్రెస్​కన్నేసింది. మీ సంపాదన మీ పిల్లలకు కాకుండా చేసేందుకు​కుట్ర చేస్తుండ్రు. ఇక్కడ పన్నులు వసూలు చేసి ఢిల్లీలో కప్పం కడుతున్నరు. ఆర్ఆర్​ట్యాక్స్​పై ఆలోచించకుంటే ఐదేళ్లలో ఆగమైతరు’ అని అన్నారు.

ALSO READ :