Hyderabad :కిడ్నాప్​చేసి షేర్ల మార్పిడి

Hyderabad : ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో నిందితుడిగా ఉన్న టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావుపై మరో కేసు నమోదైంది. క్రియా హెల్త్ కేర్ సంస్థ డైరెక్టర్లతో కలిసి చైర్మన్ వేణుమాధవ్ చెన్నుపాటి వద్ద నుంచి బలవంతంగా షేర్లు యాజమాన్య మార్పిడి చేశారు. 2018 నవంబర్ లో సంస్థ చైర్మన్ ను టాస్క్ ఫోర్స్ ఆఫీస్ తీసుకువెళ్లి పత్రాలపై సంతకాలు చేయించారు. తాజాగా రాధా కిషన్ రావు అరెస్ట్ కావడంతో బాధితుడు వేణుమాధవ్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు రాధాకిషన్‌రావుతో పాటు , ఇన్‌స్పెక్టర్లు గల్లుమల్లు, మల్లికార్జున సహా మరో ఆరుగురిపైనా పోలీసులు కేసు ఫైల్​చేశారు.

ALSO READ :