(India) భారత్ -– పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో రైల్వే ప్రయాణికుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ వెల్లడించారు. హైదరాబాద్లో ప్రధాన రైల్వేస్టేషన్లైన సికింద్రాబాద్, కాచిగూడలో భారీగా భద్రతను పెంచినట్లు ఆయన తెలిపారు. సీసీ కెమెరాల సంఖ్యను సైతం పెంచి పర్యవేక్షణ చేస్తున్నట్లు చెప్పారు. ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భద్రత కారణాల దృష్ట్యా దేశవ్యాప్తంగా పలు ఎయిర్పోర్ట్లు మూసి వేయడంతో రైల్వేస్టేషన్లకు ప్రయాణికుల తాకిడి పెరిగిందన్నారు. దీంతో భద్రత కోసం ప్రత్యేక బలగాలను మోహరించినట్లు ఆయన చెప్పారు. (India) ప్రయాణికుల రద్దీకీ అనుగుణంగా ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నామని సీపీఆర్వో శ్రీధర్ తెలిపారు.
భారత్ -– పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో రైల్వే ప్రయాణికుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ వెల్లడించారు. హైదరాబాద్లో ప్రధాన రైల్వేస్టేషన్లైన సికింద్రాబాద్, కాచిగూడలో భారీగా భద్రతను పెంచినట్లు ఆయన తెలిపారు. సీసీ కెమెరాల సంఖ్యను సైతం పెంచి పర్యవేక్షణ చేస్తున్నట్లు చెప్పారు. ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భద్రత కారణాల దృష్ట్యా దేశవ్యాప్తంగా పలు ఎయిర్పోర్ట్లు మూసి వేయడంతో రైల్వేస్టేషన్లకు ప్రయాణికుల తాకిడి పెరిగిందన్నారు. దీంతో భద్రత కోసం ప్రత్యేక బలగాలను మోహరించినట్లు ఆయన చెప్పారు. ప్రయాణికుల రద్దీకీ అనుగుణంగా ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నామని సీపీఆర్వో శ్రీధర్ తెలిపారు.
భారత్, -పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఐపీఎల్18వ సీజన్ వారం రోజుల పాటు వాయిదా పడిన సంగతి తెలిసిందే. మిగతా మ్యాచులను హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో నిర్వహించాలని బీసీసీఐ షార్ట్ లిస్ట్ చేసినట్లు సమాచారం. పాక్ సరిహద్దు రాష్ట్రాలతో పాటు నార్త్ ఇండియాలోని ప్రముఖ ప్రాంతాలను టార్గెట్ చేస్తూ పాక్ డ్రోన్, మిస్సైల్ దాడులకు పాల్పడుతోంది. దీంతో దక్షిణాది వేదికల్లో మ్యాచుల నిర్వహణ సేఫ్ అని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరో వైపు వారం రోజుల తర్వాత ఐపీఎల్మ్యాచ్లు ప్రారంభమవుతాయని టాక్.
Also read:

