ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన మార్గాల్లో ఒకటైన Strait of Hormuz వద్ద (Iran) ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ జలసంధి ద్వారా వెళ్లే చమురు ట్యాంకర్లపై టోల్ వసూలు చేయాలని ఇరాన్ పార్లమెంట్ సెక్యూరిటీ కమిటీ ఆమోదం తెలిపింది.

(Iran) ప్రతిపాదించిన “హర్మూజ్ మేనేజ్మెంట్ ప్లాన్”కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ నిర్ణయం అమలుకు మార్గం సుగమమైంది. ఈ ప్రణాళిక ప్రకారం ఒక్కో చమురు ట్యాంకర్పై గరిష్ఠంగా రూ.18.90 కోట్ల వరకు టోల్ వసూలు చేసే అవకాశముందని అధికారిక మీడియా IRIB వెల్లడించింది.
ఈ ప్రణాళికలో భాగంగా హర్మూజ్ జలసంధి ద్వారా ప్రయాణించే నౌకలపై రియాల్ కరెన్సీలో టోల్ వసూలు చేయడం, సముద్ర భద్రతను బలోపేతం చేయడం, నౌకల సురక్ష, పర్యావరణ పరిరక్షణ, ఆర్థిక నియంత్రణలను అమలు చేయాలని ప్రతిపాదించారు.
అదేవిధంగా అమెరికా, ఇజ్రాయెల్కు చెందిన నౌకలను ఈ మార్గంలో పూర్తిగా నిషేధించాలనే ప్రతిపాదన కూడా ఈ ప్లాన్లో ఉంది. అలాగే ఇరాన్పై ఏకపక్ష ఆంక్షలు విధిస్తున్న దేశాల నౌకలపై అదనపు పరిమితులు విధించే అవకాశం ఉందని సమాచారం.
హర్మూజ్ జలసంధిపై తమ సార్వభౌమాధికారాన్ని బలంగా ప్రకటిస్తూ, Omanతో కలిసి ఈ జలసంధి నిర్వహణకు చట్టపరమైన వ్యవస్థ రూపొందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ప్రపంచ చమురు రవాణాలో కీలక పాత్ర పోషించే ఈ మార్గంపై ఇరాన్ ఈ విధంగా నియంత్రణ పెంచే ప్రయత్నం చేయడం అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా గ్లోబల్ ఆయిల్ సరఫరాపై దీని ప్రభావం పడే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇదిలా ఉండగా United States మాత్రం హర్మూజ్ జలసంధిలో స్వేచ్ఛా నౌకాయానాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేసింది. అవసరమైతే అమెరికా లేదా బహుళ దేశాల రక్షణతో నౌకలను సురక్షితంగా రవాణా చేస్తామని తెలిపింది.
ప్రస్తుతం కొన్ని దేశాలు ఇరాన్తో ఒప్పందాలు చేసుకుని తమ నౌకలను పంపుతున్నప్పటికీ, దీర్ఘకాలంలో జలసంధిపై తిరిగి పూర్తి నియంత్రణ సాధిస్తామని అమెరికా ధీమా వ్యక్తం చేస్తోంది.
మొత్తంగా, హర్మూజ్ జలసంధిపై ఇరాన్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై, ముఖ్యంగా చమురు ధరలపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Also read:
