గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడత సాంగ్ పాపులర్ అయ్యింది. సోషల్ మీడియాలో ఫేమస్ అయిన కుర్చీ తాత డైలాగ్ ను ఈ సినిమాలో(iSMART) ఓ పాటకు మధ్యలో తగిలించారు. సినిమా ప్రేక్షకులను పెద్దగా అలరించలేకపోయినా పాట మాత్రం ఫేమస్ అయ్యింది. ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ సినిమాలో కల్లు దుకాణం వద్ద ఉండే ఓ పాట మధ్యలో దర్శకుడు పూరీ జగన్నాథ్ ‘అయితే ఏం చేద్దామంటవ్ మరి’అని మీడియా సమావేశాల్లో మాజీ సీఎం కేసీఆర్ అన్న మాటను ముందు పెట్టడం దుమారం రేపుతోంది. అందునా కల్లుదుకాణం వద్ద చిత్రీకరించిన పాటకు కేసీఆర్ వాయిస్ తీసుకోవడం ఆయనను అవమానించడమేననే విమర్శలొస్తున్నాయి. ఇస్మార్ట్(iSMART) శంకర్ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న డబల్ ఇస్మార్ట్ సినిమాకు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తుండగా చార్మి కౌర్ నిర్మిస్తున్నది. మణిశర్మ సంగీతం అందించగా రాహుల్ సిప్లిగంజ్ పాడిన ఈ పాటను కాసర్ల శ్యాం రాశారు. ఒక మాజీ ముఖ్యమంత్రి వాయిస్ ను తీసుకుంటున్నప్పుడు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే అనవసర వివాదాలకు దారి తీసే అవకాశం ఉంది. ఈ విషయంలో డబల్ ఇస్మార్ట్ టీం ఎలా స్పందిస్తుందో చూడాలి.
ALSO READ :

