- దాదాపు10 గంటలపాటు విచారణ
- కీలక పత్రాలపై సంతాలు తీసుకున్న ఈడీ
హమ్మయ్యా.. ఎట్టకేలకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(K KAVITHA) ఈడీ ఆఫీసు నుంచి బయటికి వచ్చారు. ఉదయం 10.30 గంటలకు ఢిల్లీలోని ఈడీ ఆఫీసుకు వెళ్లిన కవిత రాత్రి 9.15 గంటల ప్రాంతంలో బయటికి వచ్చారు. ఒక దశలో ఆమె(K KAVITHA)ను అరెస్టు చేస్తారేమో అనే వాతావరణం నెలకొంది. ఓ వైపు కుంభ వర్షం కురుస్తుండటం.. మరో వైపు భారీ సంఖ్యలో పోలీసు వాహనాలు ఈడీ ఆఫీసుకు రావడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో టెన్షన్ నెలకొంది. ప్రజలు అంతా టీవీలకు అతుక్కుపోయి వీక్షించారు. సాయంత్రం సమయానికి కవిత తరపున ముగ్గురు న్యాయవాదులతోపాటు.. ఇద్దరు డాక్టర్లు ఆఫీసులోకి వెళ్లటంతో ఉత్కంఠ నెలకొంది. అర గంట గ్యాప్ లోనే.. ఆరు గంటల సమయంలో ఇద్దరు డాక్టర్ల బృందం ఈడీ ఆఫీసులోకి వెళ్లింది. అర్ధగంట తర్వాత డాక్టర్ల బృందం బయటకు వెళ్లిపోయింది. ఇందులో ఒకరు మహిళా డాక్టర్ ఉన్నారు. ప్రస్తుతం ఈడీ ఆఫీసు వద్ద నాలుగు వాహనాలతో ఢిల్లీ పోలీసుల ఎస్కార్ వాహనం సిద్ధంగా ఉంది. ఏం జరుగుతుందనే ఆందోళన బీఆర్ఎస్ శ్రేణుల్లో నెలకొంది. దీంతో బారీ సంఖ్యలో బీఆర్ఎస్ శ్రేణులు ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయం వద్దకు చేరుకున్నాయి. ఇటు రాష్ట్రంలోనూ ఉత్కంఠ పరిస్థితి నెలకొంది. ఆమె అభిమానులు, టీఆర్ఎస్ శ్రేణులు టీవీలకు అతుక్కుపోయి ఇండియా–పాకిస్తాన్ మ్యాచ్ కంటే ఉత్కంఠగా ఎదురు చూశారు.
ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు మంత్రి కేటీఆర్. ఆయనతోపాటు మరికొంత మంది బీఆర్ఎస్ మంత్రులు వెంట ఉన్నారు. ఈడీ ఆఫీసుకు భారీ సంఖ్యలో బీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలు చేరుకుంటున్నారు. ఈ క్రమంలోనే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. బారికేడ్లతో కార్యకర్తలను అడ్డుకుంటున్నారు. ఆఫీసు పరిసరాల్లో ఎవరూ ఉండొద్దని.. అందరూ దూరంగా వెళ్లిపోవాలని పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈడీ ఆఫీసులో విచారణలో ఉన్న ఎమ్మెల్సీ కవిత దగ్గరకు ఆమె లాయర్లు వెళ్లారు. ఢిల్లీలోనే ఉన్న అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు, సీనియర్ అడ్వకేట్లు సోమ భరత్, గండ్ర మోహనరావు సాయంత్రం ఐదు గంటల సమయంలో ఈడీ ఆఫీసుకు చేరుకున్నారు. మార్చి 20వ తేదీ ఉదయం 10 గంటల 30 నిమిషాలకు కవిత ఈడీ ఆఫీసులోకి వెళ్లారు. అప్పటి నుంచి విచారణను ఎదుర్కొంటున్నారు.
అంత హడావుడి ఎందుకు?
ఈడీ ఆఫీసుకు సాయంత్రం సమయంలో సీనియర్ అడ్వకేట్లు చేరుకోవటం ఆసక్తిగా మారింది. అంత హడావిడిగా వారు రావటం ఏంటనే ప్రశ్నలు తలెత్తున్నాయి. విచారణ జరుగుతున్న సమయంలో వీరు ఆఫీసులోకి వెళ్లటం ద్వారా ఏమై ఉంటుంది అనేది ప్రశ్నగా మారింది. ఈడీ ఆఫీసు ఎదుట భారీగా పోలీసులు మోహరించారు. కార్యకర్తలను చెదరగొడతున్నారు. దీంతో ఏ క్షణం ఏం జరుగుతుందో అనే టెన్షన్ నెలకొంది. ఓ వైపు భారీ వర్షం కురుస్తున్నా.. ఆమె అభిమానులు, మీడియా ప్రతినిధులు బయటే వేచి ఉన్నారు.
ALSO READ
DELHI ED OFFICE: ఈడీ ఆఫీసు వద్ద టెన్షన్ టెన్షన్
SANJAY KUMAR: ఆ పేరు వింటే వెన్నులో వణుకే!

