Konda Surekha: రావణరాజ్యం చేస్తే ఊరుకోం

Konda Surekha

రామరాజ్యం పేరుతో రావణ రాజ్యం చేస్తామంటూ చూస్తూ ఊరుకునేది లేదని దేవాదాయశాఖ మంత్రి (Konda Surekha) కొండా సురేఖ కుండ బద్దలు కొట్టారు. ఇవాళ రామరాజ్యం సైన్యం దాడిలో గాయపడిన చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుండు రంగరాజన్ ను ఆమె పరామర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు తాను పరామర్శకు వచ్చినట్టు చెప్పారు (Konda Surekha). రంగరాజన్ పై దాడి చేసిన వారెవరినీ వదిలే ప్రసక్తే లేదన్నారు. హిందూధర్మం ఎన్నో నదులను తనలో కలుపుకునే మహాసముద్రం వంటిదని, అదే హిందూ ధర్మం గొప్పతనమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వారికి అన్నివేళలా అండగా వుంటుందని మంత్రి వారి కుటుంబానికి భరోసానిచ్చారు. సంఘవ్యతిరేక శక్తులు తమ స్వప్రయోజనాల కోసం రాముని పేరుతో రాజకీయాలు చేస్తూ, ప్రశాంతంగా సాగుతున్న తెలంగాణ సమాజాన్ని అశాంతికి గురిచేసే చర్యలను ఉక్కుపాదంతో అణచివేస్తామని తేల్చి చెప్పారు. ఎంతో ప్రాచీనమైన హిందూ ధర్మంలో ఎవరి నమ్మకాలు వారివని, తమ నమ్మకాలను ఇతరుల పై రుద్దడం వారి స్వేచ్ఛను హరించడమేనని మంత్రి అన్నారు. తన జీవిత పర్యంతం ధర్మానికే కట్టుబడి జీవించిన శ్రీరాముని పేరుతో హింసకు పాల్పడటం విచారకరమని అన్నారు. ఈ దాడికి కారకులైన వారిని చట్టబద్ధంగా శిక్షిస్తామని తేల్చి చెప్పారు. భవిష్యత్ లో ఇలాంటి చర్యలకు పాల్పడితే తీవ్ర చర్యలుంటాయని మంత్రి సురేఖ హెచ్చరించారు.

కొండా సురేఖ - వికీపీడియా

రామరాజ్యం పేరుతో రావణ రాజ్యం చేస్తామంటూ చూస్తూ ఊరుకునేది లేదని దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ కుండ బద్దలు కొట్టారు. ఇవాళ రామరాజ్యం సైన్యం దాడిలో గాయపడిన చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుండు రంగరాజన్ ను ఆమె పరామర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు తాను పరామర్శకు వచ్చినట్టు చెప్పారు. రంగరాజన్ పై దాడి చేసిన వారెవరినీ వదిలే ప్రసక్తే లేదన్నారు. హిందూధర్మం ఎన్నో నదులను తనలో కలుపుకునే మహాసముద్రం వంటిదని, అదే హిందూ ధర్మం గొప్పతనమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వారికి అన్నివేళలా అండగా వుంటుందని మంత్రి వారి కుటుంబానికి భరోసానిచ్చారు. సంఘవ్యతిరేక శక్తులు తమ స్వప్రయోజనాల కోసం రాముని పేరుతో రాజకీయాలు చేస్తూ, ప్రశాంతంగా సాగుతున్న తెలంగాణ సమాజాన్ని అశాంతికి గురిచేసే చర్యలను ఉక్కుపాదంతో అణచివేస్తామని తేల్చి చెప్పారు. ఎంతో ప్రాచీనమైన హిందూ ధర్మంలో ఎవరి నమ్మకాలు వారివని, తమ నమ్మకాలను ఇతరుల పై రుద్దడం వారి స్వేచ్ఛను హరించడమేనని మంత్రి అన్నారు. తన జీవిత పర్యంతం ధర్మానికే కట్టుబడి జీవించిన శ్రీరాముని పేరుతో హింసకు పాల్పడటం విచారకరమని అన్నారు. ఈ దాడికి కారకులైన వారిని చట్టబద్ధంగా శిక్షిస్తామని తేల్చి చెప్పారు. భవిష్యత్ లో ఇలాంటి చర్యలకు పాల్పడితే తీవ్ర చర్యలుంటాయని మంత్రి సురేఖ హెచ్చరించారు.

Konda Surekha to Leave YSR Congress Party

Also read: