రంగారెడ్డి జిల్లా నార్సింగిలో దారుణం చోటుచేసుకుంది. కటింగ్ షాప్లో బార్బర్ దారుణ హత్యకు(Murder) గురయ్యాడు. సెలూన్ షాప్ లో రాజు(47) హేర్ కటింగ్ చేసే వ్యక్తిని మరో బార్బర్ అతి కిరాతకంగా గొంతు కోసి చంపాడు. డిసెంబర్31న బార్బర్ రాజు, నిందుతుడు ప్రవీణ్మధ్య గొడవ జరిగింది. ఈ విషయంలో ప్రవీణ్పై రాజు పీఎస్లో కొద్దిరోజులు కిందట కంప్లైట్ చేశాడు. ఈ క్రమంలో ఆ విషయాన్ని మనసులో పెట్టుకొని రాజును కిరాతంగా హత్య(Murder) చేశాడు. అనంతరం నిందుతుడు ప్రవీణ్ పోలీసులకు లొంగిపోయాడు. ఘటన స్థలానికి నార్సింగి పోలీసులు చేరుకొని డెడ్బాడీని ఉస్మానియా హాస్పిటల్ కి తరలించారు.
Also read :
Pandya: డేటింగ్ లో హార్దిక్ పాండ్య
