తెలుగు సినిమా రేంజ్ని వరల్డ్వైడ్గా తీసుకెళ్లిన ‘బాహుబలి’ (Jakkanna)మళ్లీ ప్రేక్షకులను అలరించనుంది. ఈ బ్లాక్ బస్టర్ విడుదలై పదేండ్లు కంప్లీట్అయిన సందర్భంగా.. ‘ది ఎపిక్’ టైటిల్తో అక్టోబర్ 31న థియేటర్లలో రీ రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఆ సినిమాకు సంబంధించిన రన్ టైమ్ హాట్ టాపిక్ గా మారింది. దీని నిడివి 5 గంటలకు పైగానే ఉంటుందని ఒకరు, 4 గంటలు అని మరొకరు పోస్ట్లు పెడుతున్నారు. దానికి తగ్గట్టే నిర్మాత శోభు యార్లగడ్డ కూడా బాహుబలి ది ఎపిక్ రన్ టైమ్ ఓ థ్రిల్లింగ్ ఐపీఎల్ మ్యాచ్ టైమంత ఉంటుందని చెప్పాడు. దీంతో రకరకాల వార్తలు నెట్టింట షేర్ అవుతున్నాయి. తాజాగా దీనిపై నటుడు రానా స్పందించాడు.(Jakkanna) ‘బాహుబలి: ది ఎపిక్ రన్ టైమ్ ఎంతున్నా నాకు సంతోషమే. ఈ ఇయర్ నేను ఏ సినిమాలో యాక్ట్ చేయకుండానే నాకు బ్లాక్ బస్టర్ రానుంది. రన్టైమ్ ఎంతనేది నాకు కూడా చెప్పలేదు. 4 గంటలు అని పోస్ట్లు పెడుతున్నారు. అంత నిడివి ఉంటే ఆడియన్స్ చూస్తారా!. దీని రన్టైం కేవలం రాజమౌళికి మాత్రమే తెలుసు. ఆయన చెప్పేవరకూ ఎవరికీ తెలియదు. నాకైతే ఆయన ఏం చెప్పలేదు’ అని చెప్పుకొచ్చాడు. కాగా.. రానా నిర్మాతగా వ్యవహరించిన ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’ చిత్రం జులై 18న విడుదల కానుంది.
Also Read :